ప్రధాని నరేంద్ర మోడీపై ఇటీవల కాలంలో ఒంటికాలిపై దూసుకుపోతున్న తెలంగాణ మంత్రి, సీఎం కుమారుడు కేటీఆర్.. తాజాగా శోభకృత్ నామ ఉగాదిని పురస్కరించుకుని మోడీపై కేటీఆర్ ఉగాది చెమక్కులు విసిరారు. వాస్తవానికి ఇటీవల మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావన, ఆమెను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో తరచుగా మోడీని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు కూడా “ఇవి ఈడీ సమన్లు కావు.. మోడీ సమన్లు” అని కేటీఆర్ చురకలు అంటించారు.
అదేసమయంలో రాష్ట్రానికి అప్పులు చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం.. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చకపోవడం.. వంటి వాటిపైనా కేటీఆర్ సహా కేసీఆర్ కుటుంబం నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని.. కేటీఆర మోడీపై పంచ్లు గుప్పించారు. ఆసక్తికర వ్యాఖ్యలతో చమక్కులు మెరిపించారు. దేశీయ పంచాంగం పేరుతో కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఇది ఆద్యంత ఆసక్తిగా ఉండడంతో భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆదాయం: అదానీకి
వ్యయం: జనానికీ, బ్యాంకులకు
అవమానం: నెహ్రూకి
రాజ్యపూజ్యం: గుజరాతీ గ్రూప్కి
బస్.. బభ్రాజమానం.. భజగోవిందం
దేశీయ పంచాంగం సమాప్తం
This post was last modified on March 23, 2023 7:17 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…