ఏపీలో రాజకీయ పవనాలు మారుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు కూడా పార్టీల పరిస్థితి మారుతోందనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ వర్గాల్లోనే ఈ చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా వైసీపీ, టీడీపీలు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లోనూ ఈ మార్పు సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ది లేదనే విషయం పెద్ద ఎత్తున ప్రజల మధ్య చర్చకు వస్తోంది. ఇదే విషయంపై సీఎం జగన్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
ముఖ్యమంత్రి జగన్ వివిధ పథకాల రూపంలో కొందరికి డబ్బులు ఇస్తున్నా.. ఇతర కుటుంబాల పరిస్థితిని గమనిస్తున్న వారు.. మాత్రం అభివృద్ధి లేదనే విషయాన్ని గుర్తిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబు ఇమేజ్ పెరుగుతుండడం కూడా మారుతున్న వాతావరణానికి దన్నుగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి వైసీపీకి వ్యతిరేకంగా మారుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
మరోవైపు..యువగళం పేరుతో టీడీపీ యువ నాయకుడు పాదయాత్ర దూకుడుగా ముందుకు సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం మైనారిటీలకు మేలు చేసిందని ఒకవైపు ఆ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వంటి వారు చెబుతున్నా.. ఆ తరహా సానుకూలత మైనారిటీ వర్గాల్లో కనిపించడం లేదు. ఇటీవల గుంటూరులోని పెదకూరపాడు నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ముస్లింలు బాయ్ కాట్ చేశారు.
ఇక, మరో ఎస్సీ నియోజకవర్గం ఏకంగా మంత్రి వస్తున్నారని తెలిసి.. పెద్ద ఎత్తున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపైకి చేరుకుని నినాదాలు చేశారు. తమకు ఈ ప్రభుత్వం చేసిందేంటని నిలదీశారు. దీంతో మొత్తంగా సంక్షేమం పనిచేయడం లేదనే సంకేతాలు ప్రజలనుంచి వచ్చాయి. వీటికితోడు చంద్రబాబు దూకుడు.. ప్రభుత్వ వైఖరి ఇలా.. అన్నీ కూడా.. మారుతున్న రాజకీయ పవనాలను స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా సీఎం జగన్ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టం కావడం గమనార్హం.
This post was last modified on February 17, 2023 10:03 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…