Political News

వివేకా మర్డర్ పై రఘురామరాజు వ్యాఖ్యలు

ఏపీలో ఇపుడు రఘురామరాజు మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్, మోస్ట్ పాపులర్ పొలిటీషియన్. ఆయన అప్ డేట్ గురించి అటు జనం, ఇటు మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దానికి తగినట్టే ఆయన అంతే ఆసక్తికరంగా స్పందిస్తూ తన క్రేజును లైవ్ గా ఉంచుతున్నారు. ఈ ఉదయం తన భద్రత గురించి రాష్ట్రపతిని కలుస్తానని చెప్పిన రఘురామరాజు కలిశాక అమరావతిపై ప్రత్యేక వినతి పత్రం ఇవ్వడం సంచలనం అయ్యింది. అంతకుమించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఆయన స్పందించారు.

ఇటీవలే సీబీఐ విచారణ మొదలైన ఈ హత్య గురించి ఏపీలో మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన రఘురామరాజు త్వరలో వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు ఎవరో తెలుస్తుందని, వారికి శిక్ష కూడా పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యవహారంపై ఆయన స్పందించడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వ తప్పటడుగులు గురించే మాట్లాడుతూ వస్తున్న రఘురామరాజు తాజాగా పార్టీ వారు ఇబ్బంది పడుతున్న ఈ విషయం గురించి స్పందించడం గమనార్హం.

ఇదిలా ఉండగా… 2019 ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆయన ఇంట్లోని బాత్రూమ్ లో ఆయనను గొడ్డలితో నరికి చంపారు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని టీడీపీ ఆరోపించగా, టీడీపీ నేతలే హత్య వెనుక ఉన్నారని అపుడు సీబీఐ దర్యాప్తును కోరింది వైసీపీ. హైకోర్టులో సీబీఐ దర్యాప్తు కోసం పిటిషన్ వేసిన జగన్ అనంతరం ఉపసంహరించుకున్నారు. అయితే, అప్పట్లో జగన్ తరఫునే మాట్లాడిన వివేకా కూతురు సునీత మాత్రం సీబీఐ దర్యాప్తే కావాలని డిమాండ్ చేసింది. మరికొందరు టీడీపీ నేతలు తమను అన్యాయంగా ఇరికిస్తారు.. సీబీఐ దర్యాప్తు చేస్తేనే నిష్పక్షపాతంగా జరుగుతుందని పిటిషన్లు వేశారు. అవన్నీ పరిశీలించిన కోర్టు కేసును సీబీఐకి అప్పగించారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు కడప జిల్లాలో దర్యాప్తు చేస్తున్నారు.

This post was last modified on July 21, 2020 7:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago