ఏపీలో ఇపుడు రఘురామరాజు మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్, మోస్ట్ పాపులర్ పొలిటీషియన్. ఆయన అప్ డేట్ గురించి అటు జనం, ఇటు మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దానికి తగినట్టే ఆయన అంతే ఆసక్తికరంగా స్పందిస్తూ తన క్రేజును లైవ్ గా ఉంచుతున్నారు. ఈ ఉదయం తన భద్రత గురించి రాష్ట్రపతిని కలుస్తానని చెప్పిన రఘురామరాజు కలిశాక అమరావతిపై ప్రత్యేక వినతి పత్రం ఇవ్వడం సంచలనం అయ్యింది. అంతకుమించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఆయన స్పందించారు.
ఇటీవలే సీబీఐ విచారణ మొదలైన ఈ హత్య గురించి ఏపీలో మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన రఘురామరాజు త్వరలో వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు ఎవరో తెలుస్తుందని, వారికి శిక్ష కూడా పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యవహారంపై ఆయన స్పందించడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వ తప్పటడుగులు గురించే మాట్లాడుతూ వస్తున్న రఘురామరాజు తాజాగా పార్టీ వారు ఇబ్బంది పడుతున్న ఈ విషయం గురించి స్పందించడం గమనార్హం.
ఇదిలా ఉండగా… 2019 ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆయన ఇంట్లోని బాత్రూమ్ లో ఆయనను గొడ్డలితో నరికి చంపారు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని టీడీపీ ఆరోపించగా, టీడీపీ నేతలే హత్య వెనుక ఉన్నారని అపుడు సీబీఐ దర్యాప్తును కోరింది వైసీపీ. హైకోర్టులో సీబీఐ దర్యాప్తు కోసం పిటిషన్ వేసిన జగన్ అనంతరం ఉపసంహరించుకున్నారు. అయితే, అప్పట్లో జగన్ తరఫునే మాట్లాడిన వివేకా కూతురు సునీత మాత్రం సీబీఐ దర్యాప్తే కావాలని డిమాండ్ చేసింది. మరికొందరు టీడీపీ నేతలు తమను అన్యాయంగా ఇరికిస్తారు.. సీబీఐ దర్యాప్తు చేస్తేనే నిష్పక్షపాతంగా జరుగుతుందని పిటిషన్లు వేశారు. అవన్నీ పరిశీలించిన కోర్టు కేసును సీబీఐకి అప్పగించారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు కడప జిల్లాలో దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on July 21, 2020 7:36 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…