Political News

వివేకా మర్డర్ పై రఘురామరాజు వ్యాఖ్యలు

ఏపీలో ఇపుడు రఘురామరాజు మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్, మోస్ట్ పాపులర్ పొలిటీషియన్. ఆయన అప్ డేట్ గురించి అటు జనం, ఇటు మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దానికి తగినట్టే ఆయన అంతే ఆసక్తికరంగా స్పందిస్తూ తన క్రేజును లైవ్ గా ఉంచుతున్నారు. ఈ ఉదయం తన భద్రత గురించి రాష్ట్రపతిని కలుస్తానని చెప్పిన రఘురామరాజు కలిశాక అమరావతిపై ప్రత్యేక వినతి పత్రం ఇవ్వడం సంచలనం అయ్యింది. అంతకుమించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఆయన స్పందించారు.

ఇటీవలే సీబీఐ విచారణ మొదలైన ఈ హత్య గురించి ఏపీలో మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన రఘురామరాజు త్వరలో వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు ఎవరో తెలుస్తుందని, వారికి శిక్ష కూడా పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యవహారంపై ఆయన స్పందించడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వ తప్పటడుగులు గురించే మాట్లాడుతూ వస్తున్న రఘురామరాజు తాజాగా పార్టీ వారు ఇబ్బంది పడుతున్న ఈ విషయం గురించి స్పందించడం గమనార్హం.

ఇదిలా ఉండగా… 2019 ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆయన ఇంట్లోని బాత్రూమ్ లో ఆయనను గొడ్డలితో నరికి చంపారు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని టీడీపీ ఆరోపించగా, టీడీపీ నేతలే హత్య వెనుక ఉన్నారని అపుడు సీబీఐ దర్యాప్తును కోరింది వైసీపీ. హైకోర్టులో సీబీఐ దర్యాప్తు కోసం పిటిషన్ వేసిన జగన్ అనంతరం ఉపసంహరించుకున్నారు. అయితే, అప్పట్లో జగన్ తరఫునే మాట్లాడిన వివేకా కూతురు సునీత మాత్రం సీబీఐ దర్యాప్తే కావాలని డిమాండ్ చేసింది. మరికొందరు టీడీపీ నేతలు తమను అన్యాయంగా ఇరికిస్తారు.. సీబీఐ దర్యాప్తు చేస్తేనే నిష్పక్షపాతంగా జరుగుతుందని పిటిషన్లు వేశారు. అవన్నీ పరిశీలించిన కోర్టు కేసును సీబీఐకి అప్పగించారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు కడప జిల్లాలో దర్యాప్తు చేస్తున్నారు.

This post was last modified on July 21, 2020 7:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

9 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

9 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

10 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

11 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

13 hours ago