భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ మొదలైపోయాయి.. ఇక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడమే తరువాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ వాళ్ల వ్యాక్సిన్ క్లినియల్ ట్రయల్స్ చివరి దశకు వచ్చేశాయి. ఫలితాలు బాగున్నాయి. వ్యాక్సిన్ రెడీ అయిపోయినట్లే. రష్యా వ్యాక్సిన్ అన్ని ప్రక్రియలూ పూర్తి చేసుకుంది. వచ్చే నెలలోనే మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఇలా రోజుకో వార్త చదువుతున్నాం.
వ్యాక్సిన్ కోసం ఆశగా చూస్తున్నాం. కానీ నిజంగా వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది. మనం వ్యాక్సిన్ వేసుకునే రోజులు ఎప్పుడొస్తాయి అన్న విషయంలో క్లారిటీ లేదు. మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్కు అన్ని అనుమతులూ వచ్చి మార్కెట్లోకి రావడం ఈ ఏఢాది అయితే జరగదన్నది నిపుణుల మాట.
మరి విదేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి? అవి మన వరకు ఎప్పుడొస్తాయి అని అడిగితే మాత్రం.. వాటి విషయంలో మరీ ఆశలు పెట్టుకోవద్దని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వివిధ దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్లను ముందు ఆ దేశాల అవసరాలకు తగ్గ స్థాయిలో ఉత్పత్తి చేయడమే సవాలు అని.. కోట్లల్లో డోస్లకు ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయని.. ఆ మేరకు పని పూర్తి చేయడానికే కనీసం ఆరు నెలలు పడుతుందని అంటున్నారు.
అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి అగ్ర దేశాలు.. తమ దేశాల్లో తయారయ్యే వ్యాక్సిన్లను సమీప భవిష్యత్తులో బయటికి వెళ్లే అవకాశం ఇవ్వబోవని, కాబట్టి ఎక్కడో వ్యాక్సిన్ రెడీ అయిపోయిందని మనం సంబరపడిపోవాల్సిన పని లేదని అంటున్నారు నిపుణులు. అలాగే విదేశాల్లో తయారయ్యే వ్యాక్సిన్లను మన దేశంలో ఉత్పత్తి చేసేందుకు అనుమతులు పొందడం అంతా పెద్ద ప్రక్రియ అని.. కాబట్టి మన దగ్గర తయారయ్యే వ్యాక్సిన్ మీదే ఆశలు పెట్టుకోవాలని.. ఐతే భారత్ బయోటెక్, మరో సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లున్నాయని.. వ్యాక్సిన్ తయారీలో అన్ని దశలూ పూర్తి చేసుకుని, అనుమతులు పొంది.. డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేయడానికి మన దగ్గరా ఆరు నెలలకు పైనే సమయం పడుతుందని.. కాబట్టి ఈ ఏఢాది వ్యాక్సిన్ మీద ఆశలు పెట్టుకోవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
This post was last modified on July 21, 2020 3:05 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…