నిమ్మగడ్డ ఎఫెక్టో ఏంటో గాని కోవిడ్ 19 వచ్చినప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏనాడూ దానిని లెక్క చేయలేదు. ముందు నుంచి దానిని ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదు. టెస్టులు పెంచుతున్నారు, ఆస్పత్రులు పెంచుతున్నారు. చికిత్సలు పెంచుతున్నారు. కానీ కోవిడ్ అందరికీ వచ్చేదే, ఏమీ భయపడకండి అన్ని సదుపాయాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా మాస్కుల గురించి అధికారికంగా ప్రతిఒక్కరు వేసుకోవాలని జగన్ ఆర్డరు కూడా వేశారు. ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు.
ముఖ్యమంత్రి అసమర్థత, అలసత్వం వల్లే కరోనా రాష్ట్రంలో ఇంతగా విస్తరించింది. ఇన్నాళ్లకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆయన జీవో తెచ్చారు. జనాలకు మాస్కు వేసుకోమని చెబుతున్న సీఎం జగన్ ఇంతవరకు ఏ మీటింగ్ లోను మాస్కు ధరించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. చివరకు పులివెందులకు వచ్చినపుడు అంతమంది జనంలో ఉన్నపుడు కూడా మాస్కు ధరించలేదు అన్నారు. తాను ఇప్పటివరకు మాస్కు ధరించకుండా ఇతరులు మాస్కు ధరించకపోతే జరిమానా వేస్తామనడం సరికాదని అన్నారు. తాను మాస్కు ధరించి జనాలకు ఆదర్శంగ నిలవాలన్నారు.
ఈరోజు ఏపీలోని 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో చంద్రబాబు ప్రత్యేక వర్చువల్ సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా మాస్కులపై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలోనే కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు గురించి చర్చ వచ్చింది. దీనిని అస్సలు వదలొద్దని, ఇకపై ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని తాకితే వణుకొచ్చేలా చర్యలుండాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on July 21, 2020 7:58 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…