Political News

జగన్ ముందు మాస్క్ పెట్టుకో, తర్వాత జనానికి చెప్పు – చంద్రబాబు

నిమ్మగడ్డ ఎఫెక్టో ఏంటో గాని కోవిడ్ 19 వచ్చినప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏనాడూ దానిని లెక్క చేయలేదు. ముందు నుంచి దానిని ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదు. టెస్టులు పెంచుతున్నారు, ఆస్పత్రులు పెంచుతున్నారు. చికిత్సలు పెంచుతున్నారు. కానీ కోవిడ్ అందరికీ వచ్చేదే, ఏమీ భయపడకండి అన్ని సదుపాయాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా మాస్కుల గురించి అధికారికంగా ప్రతిఒక్కరు వేసుకోవాలని జగన్ ఆర్డరు కూడా వేశారు. ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు.

ముఖ్యమంత్రి అసమర్థత, అలసత్వం వల్లే కరోనా రాష్ట్రంలో ఇంతగా విస్తరించింది. ఇన్నాళ్లకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆయన జీవో తెచ్చారు. జనాలకు మాస్కు వేసుకోమని చెబుతున్న సీఎం జగన్ ఇంతవరకు ఏ మీటింగ్ లోను మాస్కు ధరించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. చివరకు పులివెందులకు వచ్చినపుడు అంతమంది జనంలో ఉన్నపుడు కూడా మాస్కు ధరించలేదు అన్నారు. తాను ఇప్పటివరకు మాస్కు ధరించకుండా ఇతరులు మాస్కు ధరించకపోతే జరిమానా వేస్తామనడం సరికాదని అన్నారు. తాను మాస్కు ధరించి జనాలకు ఆదర్శంగ నిలవాలన్నారు.

ఈరోజు ఏపీలోని 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో చంద్రబాబు ప్రత్యేక వర్చువల్ సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా మాస్కులపై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలోనే కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు గురించి చర్చ వచ్చింది. దీనిని అస్సలు వదలొద్దని, ఇకపై ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని తాకితే వణుకొచ్చేలా చర్యలుండాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

This post was last modified on July 21, 2020 7:58 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

46 minutes ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

49 minutes ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

3 hours ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

4 hours ago