ఈ ‘ర‌క్తం’ ఏఖాతాలో?

ఏపీలో చిత్ర‌మైన ర‌క్త‌దానానికి తెర‌దీసింది ప్ర‌భుత్వం. ర‌క్త‌దానం.. అంటేనే పేరులో ఉన్న‌ట్టు స్వ‌చ్ఛందంగా ఎవ‌రికి వారు ముందుకు వ‌చ్చి చేసే దానం. దీనిలో ఎవ‌రి బ‌ల‌వంతం కూడా ఉండ‌దు. ఇచ్చేవారి ఇష్టం.. ఆధారంగా చేసుకునే తీసుకునేవారు ముందుకు రావాలి. అయితే, ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా ప్ర‌భుత్వ‌మే బ‌ల‌వంత‌పు ర‌క్త దానానికి తెర‌దీయ‌డం.. ఆశ్చ‌ర్యంగానేకాదు.. ఆవేద‌న‌కు కూడా దారితీస్తోంది.

ఈ నెల 21(బుధ‌వారం) సీఎం జ‌గ‌న్ 50వ పుట్టిన రోజు. దీనిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు చేసుకోవాల‌ని.. వైసీపీ నేత‌లు భావించారు. పార్టీ వ‌ర‌కు అయితే.. దీనికి ఎవ‌రూ అడ్డు చెప్ప‌రు. అయితే.. పార్టీకి అతీతంగా.. ప్ర‌భుత్వ ప‌రంగా కూడా దీనిని నిర్వ‌హించాల‌ని భావించడం.. ఉద్యోగుల‌నుంచి బ‌ల‌వంత‌పు ర‌క్త సేక‌ర‌ణ‌కు పూనుకోవ‌డం.. తీవ్ర వివాదానికి దారితీసింది.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ.. గ‌త రెండు రోజుల నుంచి ఉద్యోగుల‌కు, వ‌లంటీర్ల‌కు.. ర‌క్త దానంపై ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా ఎంపీడీవోలు.. త‌మ త‌మ మండ‌లాల స్థాయిలో ఉద్యోగుల‌ను మండ‌ల కేంద్రాల‌కు వ‌చ్చి మ‌రీ ర‌క్త దానం చేయాలంటూ.. ఆదేశాలు జారీ చేయ‌డం.. దీనికి సంబంధించి హాజ‌రు కూడా న‌మోదు చేసుకోవ‌డం.. వంటివి తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.

ఇక‌, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో అయితే.. గ‌త రాత్రి నుంచి పెద్ద ఎత్తున టెంట్లు వేసి.. మ‌రీ ర‌క్త దానం సేక‌రిస్తున్నారు. ఇక‌, క‌ళాశాల విద్యార్థుల నుంచి కూడా ర‌క్తాన్ని తీసుకోవాల‌ని..ఆయా కాలేజీల‌కు టార్గెట్లు పెట్టారు. లేక‌పోతే.. త‌నిఖీలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. మ‌రి ఇది పైస్థాయిలో తెలిసే జ‌రుగుతోందా? లేక‌.. విష‌యం ఏంట‌నేది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

నిజానికి ఆరోగ్య వంతులైన వ్య‌క్తుల నుంచి ర‌క్తాన్ని సేక‌రించాల‌ని వైద్యులు చెబుతున్న విష‌యం తెలిసిందే. కానీ, ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌ను మ‌రిపించి.. మురిపించి.. ఆయ‌న దీవెన‌లు పొందాల‌నే ఉబ‌లాటం కొద్దీ అంద‌రి నుంచి ర‌క్తం సేక‌రిస్తుండ‌డం.. విప‌రీత ప‌రిణామాల‌కు దారితీసే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. అస‌లు ఇలా బ‌ల‌వంత‌పు ర‌క్త సేక‌ర‌ణ అనేది దేశంలో ఎక్క‌డా లేద‌ని ప్ర‌స్తుతం తీసుకుంటున్న ర‌క్తం ఏఖాతాలో జ‌మ వేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.