మూడు రాజ‌ధానుల‌కు మూడేళ్లు.. ఏం సాధించిన‌ట్టు..?

ఏపీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించిన మూడు రాజ‌ధానులకు ఈ నెల 17వ తేదీతో మూడేళ్లు పూర్త య్యాయి. అసెంబ్లీ సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. వ‌చ్చే రెండేళ్ల‌లోనే మూడు రాజ‌ధానులు సాకారం అవుతా య‌ని చెప్పారు. అయితే.. ఇవి ఎక్క‌డిగొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారిపోయాయి. స‌రే.. ఇవి అలా ఉండ‌డానికి న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు మాత్ర‌మే కార‌ణం కాదు.. రాజ‌కీయ ప‌ర‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇప్పుడు ఎలానూ.. మూడు రాజ‌ధానుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధాని అనే విష‌యం న్యాయ‌ప‌రిధిలో ఉంది. దీంతో మూడు రాజ‌ధానులు ప్ర‌క‌టించినా.. ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌నే వాద‌న అయితే ప్ర‌ధానంగా వినిపిస్తోంది. అయితే.. దీనివెనుక‌.. రాజ‌కీయంగా వైసీపీకి మ‌రో వ్యూహం కూడా ఉంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. సంక్షేమం ప‌నిచేయ‌క‌పోతే.. వెంట‌నే ఈ క‌త్తిని ప్ర‌యోగించే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు.

అంటే.. మూడు రాజ‌ధానుల‌తో మూడు ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తామ‌నే అజెండాను వైసీపీ ముందుకు తీసుకువచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌ర్నూలులో ఇప్ప‌టికే హైకోర్టును కాంక్షిస్తూ.. పెద్ద ఎత్తున వైసీపీ స‌భ‌లు నిర్వ‌హించింది. ఇక‌, విశాఖ‌లో రాజ‌ధాని కోసం అక్క‌డ కూడా మంత్రులు గ‌డివాడ అమ‌ర్నాథ్‌, సీదిరి అప్ప‌ల‌రాజు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లు స‌భ పెట్టారు. వీటిపై ఇత‌మిత్థంగా పార్టీ త‌ర‌ఫున ప్ర‌క‌ట‌న లేదు.

అయినా.. వీటిని లైవ్‌లో ఉంచి.. సంక్షేమం కుద‌ర‌క‌పోతే.. మూడు రాజ‌ధానుల అస్త్రాన్ని ప్ర‌యోగించే వ్యూహంతో వైసీపీ ఉంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే.. మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌క‌టించినా.. పార్టికీ అనుకున్న విధంగా మైలేజీ అయితే ద‌క్క‌లేదు. సో.. ఈ క్ర‌మంలోనే పార్టీ వ్యూహాలు మార‌తాయ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికిఎలాగైనా ముందుకు సాగ‌డం ఖాయ‌మ‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు.