Political News

కుల రాజకీయాన్ని కొత్తగా డీల్ చేసిన పవన్ 

ఏపీలో కుల రాజ‌కీయాలు పెరిగిపోయాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కులాలను వాడుకుని నేతలు ఎదుగుతున్నారు.. ఆడుతున్నారు తప్ప… కులాల్లోని ప్రజలు మాత్రం వెనకబడి పోతున్నారని అన్నారు.  సంఖ్యా బలం ఉన్న కులాలు ఐక్యతతో ఉంటే భవిష్యత్తులో రాష్ట్రం వారి చేతిలోనే ఉంటుందని తెలిపారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం నాయకులతో పవన్ భేటీ అయ్యారు.

బీసీ కులాలకు ఒక్కొక్క దానికీ ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టి కులానికో పదవి, రూ.75 వేలు జీతం పడేస్తే కులం మొత్తం మారు మాట్లాడకుండా ఉంటుందన్న భావన మారాలంటూ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు ప‌వ‌న్ షాకిచ్చారు. హక్కుల కోసం దేహీ అనే పరిస్థితి నుంచి హక్కులు సాధించుకునే పరిస్థితికి బీసీలు ఎదగాలని కోరుకుంటున్నానని తెలి పారు. “కులం, మతం, ప్రాంతాలను ఉద్దేశించి మాట్లాడాలంటే ఏ రాజకీయ పార్టీకైనా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి“ ఉంటుంద‌ని తెలిపారు.

“కులాన్ని నేను వేరే కోణం నుంచి చూస్తాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా కులం, మతం, ప్రాంతం అనే విషయాలకు భయపడకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఓటు బ్యాంకు రాజకీ యాలు చేయను. కాబట్టి, సామాజిక రుగ్మతలను సోషల్ డాక్టర్ మాదిరిగా స‌రిచేస్తాను. ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కావు వ‌ర్గం నుంచి ఒక ఎంపీ, ఒక మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు  ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.

అయితే, ఏపీలో దాదాపు 16 లక్షల మంది సంఖ్యాబలం ఉండి కూడా సమస్యలు తీర్చండి అని ప్రాధేయ పడటం బాధాకరమ‌న్నారు. “వైసీపీ నేతలకు మీరు మద్దతు పలికారు. లేకపోతే అంత మెజారిటీ వచ్చేది కాదు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. లంచం ఇస్తే తప్ప ఓబీసీ సర్టిఫికేట్ రాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారాలంటే బీసీ కులాల నుంచి నాయకత్వం పెరగాలి“ అని దిశానిర్దేశం చేశారు.

స్వలాభం కోసం కుల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారంటూ.. మంత్రుల‌పై విరుచుకుప‌డ్డారు. 2024 ఎన్నికల తర్వాత ఇలాంటి సమావేశాలు మళ్లీ జరగకూడదన్న ప‌వ‌న్‌.. ఇప్పుడు పోరాడకపోతే జీవితాంతం వైసీపీ నేత‌ల‌ మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చ‌రించారు. కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. కుల ప్రయోజనాలను కాపాడే నేతలను ముందు నిలబెట్టండి. వాళ్లకు డబ్బు లేకపోయినా ఫర్వాలేదు. మీరు నాయకత్వం పెంచుకోకపోతే కొద్ది మంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. 

This post was last modified on November 27, 2022 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

2 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

4 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

4 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

6 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

8 hours ago

బండ్ల గణేష్ చెప్పినట్లే.. బన్నీ వాసు

గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…

8 hours ago