ప్రధాన ప్రతిపక్షం టీడీపీని చంద్రబాబు నాలుగు అడుగులు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఆయనకు తోడుగా తమ్ముళ్లు కూడా మరింత ముందుకు తీసుకువెళ్లాలని..బాబు పిలుపునిస్తున్నా రు. అయితే, కొందరు మాత్రం చంద్రబాబు లెక్క ప్రకారం అంతో ఇంతో ముందుకు తీసుకువెళ్లే ప్రయ త్నం చేస్తుంటే ఎక్కువ మంది మౌనంగా ఉంటున్నారు. సరే.. మౌనంగా ఉన్నా ఫర్వాలేదు.
కానీ, వీరిలో ఒకరిద్దరు చేస్తున్న పనులు పార్టీని నలభై అడుగుల మేరకు వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఆ చివర నుంచి ఈ చివర వరకు కూడా పలువురు నాయ కులు చేస్తున్న యాగీతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వ్యవహారం తాజాగా అధిష్టానం దృష్టికి వచ్చింది.
ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలోనే కాకుండా పార్టీ వర్గాల్లోనూ దుమారం రేపుతున్నాయి. కురబ సామాజిక వర్గానికి చెందిన ఒక సమావేశానికి హాజరైన బీకే.. ఈ సందర్భంగా సొంత పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోట్లు ఉంటే తప్ప టీడీపీ టికెట్ రాదని.. ఆశలు పెట్టుకోవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. అప్పటి వరకు పార్టీలోకి రావాలని అనుకున్నవారు కూడా వెనుకడుగు వేశారు.
నిజానికి బీకే పార్టీలో సీనియర్ నాయకుడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయారు. చంద్రబాబు దగ్గర కూడా మంచి మార్కులే ఉన్నాయి. కానీ, ఆయన పార్టీకి ఉపయోగపడాల్సింది పోయి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు పార్టీని రోడ్డున పడేసిందనే వాదన వినిపిస్తోంది. జేసీ లాంటి వారు ఎలానూ పార్టీ తరఫున పని చేయరు.. కనీసం ఇలాంటి వారైనా పనిచేస్తారని భావించిన చంద్రబాబుకు ఇలాంటి వారు షాకులు ఇస్తున్నారు. దీని వల్ల జరిగే నష్టాన్ని వారు ఊహించ లేక పోతుండడం గమనార్హం.
This post was last modified on November 27, 2022 11:01 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…