ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ను ఆయన సొంత అల్లుడు వెన్నుపోటు పొడిచారంటూ జరిగే ప్రచారానికి సంబంధించిన వాదనలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే.. ఇది ఏ మాత్రం వెన్నుపోటు కాదు అన్న విషయాన్ని చంద్రబాబుకు సన్నిహితంగా ఉండేవారు.. నాటి రాజకీయ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు చెబుతుంటారు. అయినప్పటికి ఆ వాదనను ఏకీభవించకుండా అది ముమ్మాటికి వెన్నుపోటే అని తేల్చేసే వారు కనిపిస్తారు. అయితే.. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వెన్నుపోటు మచ్చను తుడిపేసుకునే విషయంలో ఫెయిల్ అయ్యారనే మాట వినిపిస్తూ ఉంటుంది.
ఇక.. విషయంలోకి వస్తే.. ఇప్పుడు ఆ ఎపిసోడ్ గురించిన చర్చ వచ్చిందంటే.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెన్నుపోటు ఎపిసోడ్ ను ఎందుకు ప్రస్తావించారంటే.. తాజాగా ఆయన క్రిష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆయన కాళ్లకు నమస్కరించారు. ఈ సందర్భంగా పాత గురుతుల్ని గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ఇంటికి తాను వెళ్లానని.. అప్పట్లో ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే.. కొందరు మహిళా నేతలు ఆయన కాళ్లకు నమస్కారం చేస్తున్నారన్నారు. ఆ తర్వాత వాళ్లు వెళ్లిన తర్వాత.. అలా కాళ్లకు ఎందుకు నమస్కారం చేస్తున్నారని తాను అడిగానని.. తనపై వారికి ఉన్న అభిమానానికి నిదర్శనమని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పారన్నారు. అయితే.. అదేమీ నిజం కాదని తానుచెప్పినా.. ఎన్టీఆర్ ఒప్పుకోలేదన్నారు.
ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ఆగస్టు సంక్షోభం చోటు చేసుకోవటం.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ లో అప్పట్లో ఎన్టీఆర్ కాళ్లకు నమస్కారం చేసిన ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ వెంకయ్య చెప్పిన మాట.. ఇప్పుడు చర్చగా మారింది. చంద్రబాబుకు సన్నిహితుడిగా చెప్పే వెంకయ్య నోటి నుంచి కూడా వెన్నుపోటు కథ రావటం బాబుకు కాస్త ఇబ్బంది కలిగించే విషయంగా చెప్పక తప్పదు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…