తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’ సహా చాలా సినిమాలకు అలాగే చేశాడు. కానీ ‘వారణాసి’ విషయంలో మాాత్రం ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించాడు. సైలెంటుగా షూటింగ్ మొదలుపెట్టి కొన్ని నెలల చిత్రీకరణ తర్వాత ఒక షో రీల్ లాంటి వీడియోతో వారణాసి ప్రపంచాన్ని పరిచయం చేశాడు. కానీ అందులోనూ కథేంటన్నది వెల్లడించలేదు.
ఈ సినిమా విడుదలకు 8 నెలల సమయం ఉండగా, జక్కన్న ఇప్పుడు ఒక ఫ్రెంచ్ మ్యాగజైన్తో మాట్లాడుతూ.. ‘వారణాసి’ ముచ్చట్లు పంచుకున్నాడు కానీ, అందులో కూడా కథ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ గ్లింప్స్లో సంకేతాలు ఇచ్చినట్లే.. ఈ కథ వారణాసిలో మొదలై అంటార్కిటికాకు వెళ్లి, ఆఫ్రికాలోనూ ప్రయాణించి.. గతంలోకి వెళ్లి రామాయణ కాలాన్ని టచ్ చేసి, చివరగా తిరిగి వారణాసికే వస్తుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.
2022లో ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత ఈ కథ మీద కసరత్తులు మొదలుపెడితే ఇప్పటికి నాలుగున్నరేళ్లు గడిచాయని.. ప్రస్తుతం ‘వారణాసి’ చిత్రీకరణ 80 శాతం పూర్తయిందని.. ఇంకో 20 శాతం షూట్ మాత్రమే మిగిలుందని, అన్నీ అనుకున్న ప్రకారమే సాగుతున్నాయని రాజమౌళి తెలిపాడు. సినిమాలో భారీ, యాక్షన్ ఘట్టాలన్నీ పూర్తి చేశామని, ఇక తీయాల్సింది చిన్న చిన్న సన్నివేశాలే అని జక్కన్న చెప్పాడు.
మొత్తంగా ఐమాక్స్ ఫార్మాట్లో తీసిన తొలి నాన్-ఇంగ్లిష్ సినిమా ‘వారణాసి’నే అని చెప్పిన రాజమౌళి.. ఆ ఫార్మాట్ ఎంచుకోవడానికి గల కారణాలను వివరించాడు. ఈ సినిమాలో 300 అడుగుల ఎత్తుండే అంటార్కిటికా పర్వతాలను క్యాప్చర్ చేయాల్సి వచ్చిందని.. అలాగే భారీగా ఉండే వానర సేనలనూ చూపించామని.. అలాంటి సన్నివేశాలను చూపించడానికి ఐమాక్స్ ఫార్మాటే కరెక్ట్ అని అన్నాడు. కథ గురించి ఎక్కువ వెల్లడించలేని స్థితిలోనే గత ఏడాది గ్లింప్స్ ద్వారా వారణాసి ప్రపంచాన్ని అలా పరిచయం చేసినట్లు జక్కన్న తెలిపాడు.
This post was last modified on August 3, 2026 11:26 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…