ఒకప్పుడు యూత్ ఫుల్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నితిన్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వేగంగా చేసిన సినిమాలు చాలా మటుకు ప్రతికూల ఫలితాలే ఇచ్చాయి. పేరున్న దర్శకులు, పెద్ద బ్యానర్లే వచ్చినా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండుగా మిగిలిపోయింది. భీష్మ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల సైతం రాబిన్ హుడి అనే అవుట్ డేటెడ్ మూవీ తీశారంటే నితిన్ లెక్క ఎక్కడ తప్పుతోందో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ గా తనకు బాక్సాఫీస్ తత్వం అర్థమైనట్టు ఉంది.
న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందబోయే అలియాస్ రుక్మిణిలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ కాంబో గురించి వారం రోజులుగా వార్తలు తిరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక చిన్న వీడియో టీజర్ రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. శృంగార నవలలు రాసే ఇంజనీరింగ్ కుర్రాడు వాటి ద్వారా తన కలం పేరు రుక్మిణితో పాఠకులకు దగ్గరవుతాడు. ఎవరైనా రుక్మిణి ఎవరని అడిగితే నా భార్య పేరు అంటాడు. ఇంతకీ ఆమె నిజంగా వైఫా, తనే ఆ బుక్కులు రాసిందా అనేది తెరమీద చూడాలి.
దండోరా లాంటి సీరియస్ కాన్సెప్ట్ తో విమర్శకులను మెప్పించిన దర్శకుడు మురళికాంత్ దేవసోత్ ఈసారి రూటు మార్చి వినోదం వైపు వచ్చేశారు. స్టోరీ పాయింట్ చూస్తుంటే నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మాములుగా అయితే ఈ కాలంలో నవలలు చదివే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఈ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం చూస్తుంటే మురళికాంత్ వెనక్కు వెళ్లి ఏదైనా 90 దశకం కథ చెబుతారా లేక కొత్తగా ట్రై చేశారా అనేది ఇప్పుడే చెప్పలేం. డిఫరెంట్ ఫీలైతే ఇచ్చారు.
మొత్తానికి నితిన్ అయితే దారిలో పడినట్టే అని చెప్పాలి. ఇప్పుడు తనకు కావాల్సింది మసాలా సినిమాలు కాదు. అలా ఆలోచించే మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, తమ్ముడు లాంటి దారుణమైన ఫ్లాపులు చవి చూడాల్సి వచ్చింది. కానీ అలియాస్ రుక్మిణి ఆ క్యాటగిరీలోకి రాదు కాబట్టి అభిమానులు రిలాక్స్ అవ్వొచ్చు. ప్రస్తుతం సితార బ్యానర్ లో రూపొందుతున్న మూవీ కూడా ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగానే ఉంటుందట. ఇవి వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
This post was last modified on August 3, 2026 11:00 am
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…