టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్ అనుకోకుండా మరో వివాదంలో చిక్కుకున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో మొదలైన సినిమాలో కథానాయకుడిగా ఖరారైన అతను.. కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ సినిమాకు కాల్ షాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని అర్జున్ ఈ విషయమై హైదరాబాద్కు చేరుకుని విశ్వక్ మీద ప్రొడ్యూసర్స్ గిల్డ్కు ఫిర్యాదు చేయడమే కాక.. ప్రెస్ మీట్ పెట్టి అతడి మీద తీవ్ర ఆరోపణలు చేశాడు.
సెట్స్ వేసుకుని, నటీనటులందరి కాల్ షీట్స్ సంపాదించి, షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్ల చేసుకున్నాక మూడుసార్లు విశ్వక్ షూట్ క్యాన్సిల్ చేయించాడని.. ఇలాంటి అన్ ప్రొఫెషనల్ నటుడితో సినిమా చేయబోనని అర్జున్ ఆవేదన స్వరంతో చెప్పాడు. కథ నచ్చి సినిమా ఒప్పుకున్నాక విశ్వక్ కథలో కరెక్షన్లు చెప్పడం.. అలాగే డైలాగ్స్, పాటల విషయంలో అభ్యంతరాలు చెప్పడం గురించి అర్జున్ ప్రస్తావించాడు. ఐతే దీనిపై విశ్వక్ ఎలా స్పందిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతనైతే ప్రస్తుతానికి సైలెంటుగా ఉన్నాడు.
ఐతే విశ్వక్ టీం చెబుతున్న దాని ప్రకారం.. స్వయంగా రచయిత, దర్శకుడు అయిన విశ్వక్ షూట్ జరుగుతున్న టైంలో కథలో కొన్ని లోపాలు గుర్తించి మార్పులు చేర్పులు సూచించాడని, కానీ అర్జున్ అవేమీ స్వీకరించకుండా తాను చెప్పినట్లే చేయాలని కండిషన్లు పెట్టడంతో విశ్వక్ ఇగో హర్టయి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని అనుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా తనకు ఉపయోగపడదని అతను ఫీలైనట్లుగా చెబుతున్నారు. కానీ ఈ వాదన అంత సమంజసంగా అయితే అనిపించడం లేదు.
విశ్వక్ దీనిపై మీడియాతో మాట్లాడి తన వాదనను బలంగా వినిపిస్తే తప్ప విమర్శలు తప్పకపోవచ్చు. ఆదివారం ఒక సినిమా టీజర్ లాంచ్ కోసం హైదరాబాద్ ఏఎంబీ మాల్కు వస్తున్న విశ్వక్.. అక్కడేమైనా మీడియాకు దీనిపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on November 6, 2022 8:18 am
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…