టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్ అనుకోకుండా మరో వివాదంలో చిక్కుకున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో మొదలైన సినిమాలో కథానాయకుడిగా ఖరారైన అతను.. కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ సినిమాకు కాల్ షాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని అర్జున్ ఈ విషయమై హైదరాబాద్కు చేరుకుని విశ్వక్ మీద ప్రొడ్యూసర్స్ గిల్డ్కు ఫిర్యాదు చేయడమే కాక.. ప్రెస్ మీట్ పెట్టి అతడి మీద తీవ్ర ఆరోపణలు చేశాడు.
సెట్స్ వేసుకుని, నటీనటులందరి కాల్ షీట్స్ సంపాదించి, షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్ల చేసుకున్నాక మూడుసార్లు విశ్వక్ షూట్ క్యాన్సిల్ చేయించాడని.. ఇలాంటి అన్ ప్రొఫెషనల్ నటుడితో సినిమా చేయబోనని అర్జున్ ఆవేదన స్వరంతో చెప్పాడు. కథ నచ్చి సినిమా ఒప్పుకున్నాక విశ్వక్ కథలో కరెక్షన్లు చెప్పడం.. అలాగే డైలాగ్స్, పాటల విషయంలో అభ్యంతరాలు చెప్పడం గురించి అర్జున్ ప్రస్తావించాడు. ఐతే దీనిపై విశ్వక్ ఎలా స్పందిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతనైతే ప్రస్తుతానికి సైలెంటుగా ఉన్నాడు.
ఐతే విశ్వక్ టీం చెబుతున్న దాని ప్రకారం.. స్వయంగా రచయిత, దర్శకుడు అయిన విశ్వక్ షూట్ జరుగుతున్న టైంలో కథలో కొన్ని లోపాలు గుర్తించి మార్పులు చేర్పులు సూచించాడని, కానీ అర్జున్ అవేమీ స్వీకరించకుండా తాను చెప్పినట్లే చేయాలని కండిషన్లు పెట్టడంతో విశ్వక్ ఇగో హర్టయి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని అనుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా తనకు ఉపయోగపడదని అతను ఫీలైనట్లుగా చెబుతున్నారు. కానీ ఈ వాదన అంత సమంజసంగా అయితే అనిపించడం లేదు.
విశ్వక్ దీనిపై మీడియాతో మాట్లాడి తన వాదనను బలంగా వినిపిస్తే తప్ప విమర్శలు తప్పకపోవచ్చు. ఆదివారం ఒక సినిమా టీజర్ లాంచ్ కోసం హైదరాబాద్ ఏఎంబీ మాల్కు వస్తున్న విశ్వక్.. అక్కడేమైనా మీడియాకు దీనిపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on November 6, 2022 8:18 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…