ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం చూస్తూనే ఉన్నాం. నంది అవార్డులను రేవంత్ రెడ్డి సర్కార్ గద్దర్ గా పేరు మార్చి, ఆల్రెడీ రెండుసార్లు వేడుక నిర్వహించి పురస్కారాలు అందజేసింది, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ వీటిని పునరుద్ధరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెబుతూ వస్తున్నారు కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. సీరియస్ గా చూడాల్సిన అంశం మరొకటి ఉంది.
ఇండస్ట్రీ నుంచి ఏపీకి ఆదాయం రావాలంటే కేవలం సినిమా రిలీజులు జరిగితే సరిపోదు. షూటింగులు ఉండాలి. రోజులు, నెలల తరబడి ఆయా యూనిట్లు మన ప్రాంతాల్లో బస చేసి చిత్రీకరణ జరిపితే సొమ్ములతో పాటు కొన్ని వేలమందికి ఉపాధి దొరుకుతుంది. స్టూడియోల నిర్మాణంతో పాటు షూటింగులు వేగవంతమయ్యేలా సహకరించేందుకు డిప్యూటీ సిఎం రూపంలో పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నా ఆ దిశగా పెద్దలు చొరవ తీసుకోవడం లేదు. హైదరాబాద్ అంతగా పెనవేసుకుపోయింది.
గత కొంత కాలంగా సినిమా ఈవెంట్లు ఏపీలో రెగ్యులర్ గా జరుగుతున్నాయి. లెనిన్ వేడుకలు వైజాగ్ – విజయవాడలో చేశారు. పెద్ది కూడా బెజవాడలోనే జరిగింది. కొరియన్ కనకరాజు ఈవెంట్ భీమవరంలో చేయబోతున్నారు. దీనికన్నా ముందు అనంతపురంలో ప్రమోషన్లు పెద్ద ఎత్తున చేశారు. బాలయ్య 112 ఓపెనింగ్ అమరావతిలో జరిగింది. ఇవన్నీ సాయంత్రం పూట కేవలం కొన్ని గంటలకు మాత్రమే పరిమితమైన కార్యక్రమాలు. ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు.
అదే ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్, భీమిలి, బొర్రా గుహలు, కాకినాడ, రాయలసీమ ప్రాంతాలు, తిరుపతి, మహానంది లాంటి పుణ్యక్షేత్రాలు మొదలైన చోట్ల షూటింగులు చేయడం మొదలుపెడితే క్రమంగా ఇండస్ట్రీ ఏపీలో కూడా బలపడేందుకు అవకాశం దొరుకుతుంది. హైదరాబాద్ వదిలి రావాల్సిన అవసరం లేదు. మెల్లగా షూటింగులను ఏపీలోని ఇతర ఊళ్లకు విస్తరింపజేసి, స్టూడియోలు కట్టడం గురించి సీరియస్ గా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతే తప్ప కేవలం ఈవెంట్లు జరిగినంత మాత్రాన సంబరపడేందుకు ఏమీ లేదు.
This post was last modified on August 3, 2026 12:29 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…