Movie News

బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్ తమన్

తమన్ కెరీర్ లో బెస్ట్ మ్యూజిక్ లిస్టు లో ‘అఖండ’ ఒకటి. ఈ సినిమా కోసం తమన్ ప్రాణం పెట్టి వర్క్ చేశాడు. బాలయ్య తనకి పూనకం తెప్పించాడని అందుకే స్కోర్ ఆ లెవెల్ లో ఇచ్చానని చాలా సార్లు తమన్ చెప్పుకున్నాడు. అఖండ కి బ్యాక్ స్కోర్ ఎంత హెల్ప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాగే సాంగ్స్ కూడా పాపులర్ అయ్యాయి. బాలయ్య అంటూ తమన్ కంపోజ్ చేసిన సాంగ్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పటికీ చాలా పబ్బుల్లో ఈ సాంగ్ పడకుండా పార్టీ క్లోజ్ అవ్వని పరిస్థితి.

ఇప్పుడు బాలయ్య -తమన్ కాంబోలో ఇంకో సినిమా వస్తుంది. ‘వీరసింహా రెడ్డి కి తమన్ మ్యూజిక్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే టీజర్, టైటిల్ మోషన్ పోస్టర్ కి తనదైన స్కోర్ ఇచ్చి మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు తమన్. అయితే ఈ సినిమా సాంగ్స్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జై బాలయ్య అనే సాంగ్ లీక్ అయింది. ఆ సాంగ్ బయటికొచ్చాక మళ్ళీ మళ్ళీ వింటూ పాపులర్ చేసేందుకు ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ కూడా రెడీ గా ఉన్నారు.

సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాకు తమన్ బెస్ట్ వర్క్ ఇచ్చి ఉంటాడని అదిరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. మరి తమన్ అండ్ టీం సాంగ్స్ రిలీజ్ చేయడమే ఆలస్యం. ప్రస్తుతం ఈ సినిమా గురించి తమన్ ఎప్పుడెప్పుడు అప్ డేట్ తో ట్వీట్ చేస్తాడా ? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

This post was last modified on November 5, 2022 10:39 pm

Share

Recent Posts

యష్ ఇమేజ్ వల్లే ఇంత ఓపెనింగ్

టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…

47 minutes ago

చిరు అతడితో సినిమా చేసి ఉంటే..

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…

2 hours ago

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

3 hours ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

3 hours ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

4 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

10 hours ago