భారత జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఇప్పటివరకు లేని కొత్త వివాదం ఒకటి తెలంగాణలో ఆయన జరిపిన యాత్ర సందర్భంగా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సోషల్ మీడియా ఫైట్ అంతకంతకూ పెరిగింది. రాహుల్ పాదయాత్ర సందర్భంగా సినీ నటి పూనమ్ కౌర్.. చేనేత వస్త్రాల్ని ధరించి వెళ్లటం.. చేనేత మీద విధించిన జీఎస్టీని తొలగించాలన్న అంశాన్ని పరిశీలించాలని కోరటం తెలిసిందే. దీనికి స్పందించిన రాహుల్.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత మీద విధించిన జీఎస్టీని ఎత్తేస్తామని తనకు హామీ ఇచ్చిన వైనాన్ని పేర్కొన్నారు.
జోడో యాత్ర సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన పూనమ్ కౌర్ చేతిని రాహుల్ గాంధీ పట్టుకున్న వైనం ఇప్పుడు రాజకీయ రగడగా మారింది. పూనమ్ చేతిని రాహుల్ పట్టుకున్న ఫోటోను బీజేపీ మహిళా నేత ఒకరు ట్విటర్ లో పోస్టు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూనం చేతిని పట్టుకున్న రాహుల్ ఫోటోను పోస్టు చేస్తూ.. తాత అడుగు జాడల్లో అంటూ బీజేపీ నేత ప్రీతి గాంధీ కామెంట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
పలువురు మహిళలతో మోడీ ఉన్న ఫోటోల్ని వారు పోస్టు చేస్తూ.. తమ నేతకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివేళ.. ఈ మొత్తం ఇష్యూకు కారణమైన పూనమ్ కౌర్ తాజాగా రియాక్టు అయ్యారు. పాదయాత్ర సందర్భంగా రాహుల్ ను కలిసిన సందర్భంలో ఆయనతో పాటు తాను నడిచిన వైనాన్ని గుర్తు చేస్తూ.. ఆ సందర్భంగా తాను కాలు జారి కింద పడబోతే రాహుల్ తన చేతిని పట్టుకున్నారని.. దీనికి ఇంత రార్ధంతం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. పూనమ్ కౌర్ చేతిని పట్టుకున్న రాహుల్ గాంధీ ఫోటో ఇప్పుడు ప్రముఖంగా వైరల్ కావటం గమనార్హం
This post was last modified on October 31, 2022 2:15 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…