Political News

జగన్ ని ఇరుకున పడేసిన తీర్పు

ఆంధ్రావ‌నిలో స‌ర్కారు త‌ర‌ఫున భూముల వేలాన్ని అడ్డుకుంటూ, వ‌ద్ద‌ని చెబుతూ.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వ‌ర్గాల అత్యుత్సాహంపై హైకోర్టు నీళ్లు జ‌ల్లింది. భూముల‌ను ప్ర‌భుత్వం వేలం వేయ‌డం ఏంట‌న్న‌ది కోర్టు వారి ప్ర‌శ్న. పేద‌ల‌కు ఇవ్వాల్సిన భూముల‌ను కార్పొరేష‌న్ పేరిట ఎలా బ‌హిరంగ మార్కెట్లో వేలం వేస్తార‌ని కూడా అంటోంది. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు పున‌రాలోచ‌న‌లో ప‌డిపోయింది.

విశాఖ కేంద్రంగా జ‌రుగుతున్న భూముల వేలం అన్న‌ది ఇప్పుడొక చ‌ర్చ‌కు తావిస్తోంది. రాజీవ్ స్వ‌గృహ పేరిట ఇళ్లు క‌ట్టించాల్సి పోయి, రాజీవ్ కార్పొరేష‌న్ పేరిట ఇళ్ల స్థ‌లాల‌ను అమ్ముకోవడం ఏంటి అన్న‌ది ప్ర‌ధాన అభ్యంత‌రంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నిన్న‌టి వేళ పేర్కొన్నారు. దీంతో ఇప్ప‌టిదాకా చేప‌ట్టిన సంబంధిత ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాల‌ని చెబుతూ
హై కోర్టు స్టే ఇచ్చింది.

ఇక్క‌డ రాజీవ్ గాంధీ స్వ‌గృహ పేరిట 22 వేల చ‌ద‌రపు గ‌జాల స్థ‌లాన్ని వేలం వేస్తున్నామ‌ని స‌ర్కారు చెబుతోంది అని, కానీ ఐదు ఎక‌రాల విస్తీర్ణాన్నీ త‌న ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా అమ్ముకోవాల‌ని చూస్తోంద‌ని హైకోర్టు మండిప‌డింది. ఈ విధంగా చేయ‌డం త‌గ‌ద‌ని అంటోంది. ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమిని త‌క్కువ విస్తీర్ణం ఉన్న భూమి కింద ఎలా చూపిస్తార‌ని అభ్యంత‌రం చెబుతూ స‌ర్కారు తీరును త‌ప్పుప‌డుతూ త‌న త‌ర‌ఫు వాద‌న‌ను బ‌లీయంగా వినిపిస్తూ వైసీపీకి ఓ విధంగా ఝ‌ల‌క్ ఇచ్చింది.

విశాఖ జిల్లా, ఎండాడ గ్రామ ప‌రిధిలో రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల‌ను (ఒక‌టి మ‌రియు ఆరో నంబ‌ర్ ప్లాట్ల‌ను) ఎలా అమ్ముతార‌ని ప్ర‌శ్నిస్తూ వెల‌గ‌పూడి రామకృష్ణ అనే ఎమ్మెల్యే (విశాఖ తూర్పు ఎమ్మెల్యే) పిటిష‌న్ దాఖలు చేశారు. దీనిపై వాద‌న‌లు వినిపించిన పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది పేద మ‌రియు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు 2007లో వైఎస్సార్ హ‌యాంలో రాజీవ్ స్వ‌గృహ‌ను తీసుకువ‌చ్చార‌ని, ఇందులో భాగంగా 2009లో 54.19 ఎక‌రాల‌ను కేటాయిస్తే అందులో స్థ‌లాన్ని ఇప్పుడు ప్లాట్లుగా చేసి ఓపెన్ ఆక్ష‌న్ ద్వారా అమ్ముకోవాల‌ని చూడ‌డం ప్రాజెక్టు స్ఫూర్తికే విఘాతం అని న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. దీనిపై మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు ఇవ్వ‌వ‌ద్ద‌ని హైకోర్టుకు ప్ర‌భుత్వ త‌ర‌ఫున న్యాయ‌వాది అభ్య‌ర్థించినా, ఈ నెల 30 ప్లాట్ల విక్ర‌యం ఉంద‌ని అంటున్నారు క‌నుక ఉత్త‌ర్వులు ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

This post was last modified on June 22, 2022 9:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

8 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago