Political News

జగన్ ని ఇరుకున పడేసిన తీర్పు

ఆంధ్రావ‌నిలో స‌ర్కారు త‌ర‌ఫున భూముల వేలాన్ని అడ్డుకుంటూ, వ‌ద్ద‌ని చెబుతూ.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వ‌ర్గాల అత్యుత్సాహంపై హైకోర్టు నీళ్లు జ‌ల్లింది. భూముల‌ను ప్ర‌భుత్వం వేలం వేయ‌డం ఏంట‌న్న‌ది కోర్టు వారి ప్ర‌శ్న. పేద‌ల‌కు ఇవ్వాల్సిన భూముల‌ను కార్పొరేష‌న్ పేరిట ఎలా బ‌హిరంగ మార్కెట్లో వేలం వేస్తార‌ని కూడా అంటోంది. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు పున‌రాలోచ‌న‌లో ప‌డిపోయింది.

విశాఖ కేంద్రంగా జ‌రుగుతున్న భూముల వేలం అన్న‌ది ఇప్పుడొక చ‌ర్చ‌కు తావిస్తోంది. రాజీవ్ స్వ‌గృహ పేరిట ఇళ్లు క‌ట్టించాల్సి పోయి, రాజీవ్ కార్పొరేష‌న్ పేరిట ఇళ్ల స్థ‌లాల‌ను అమ్ముకోవడం ఏంటి అన్న‌ది ప్ర‌ధాన అభ్యంత‌రంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నిన్న‌టి వేళ పేర్కొన్నారు. దీంతో ఇప్ప‌టిదాకా చేప‌ట్టిన సంబంధిత ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాల‌ని చెబుతూ
హై కోర్టు స్టే ఇచ్చింది.

ఇక్క‌డ రాజీవ్ గాంధీ స్వ‌గృహ పేరిట 22 వేల చ‌ద‌రపు గ‌జాల స్థ‌లాన్ని వేలం వేస్తున్నామ‌ని స‌ర్కారు చెబుతోంది అని, కానీ ఐదు ఎక‌రాల విస్తీర్ణాన్నీ త‌న ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా అమ్ముకోవాల‌ని చూస్తోంద‌ని హైకోర్టు మండిప‌డింది. ఈ విధంగా చేయ‌డం త‌గ‌ద‌ని అంటోంది. ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమిని త‌క్కువ విస్తీర్ణం ఉన్న భూమి కింద ఎలా చూపిస్తార‌ని అభ్యంత‌రం చెబుతూ స‌ర్కారు తీరును త‌ప్పుప‌డుతూ త‌న త‌ర‌ఫు వాద‌న‌ను బ‌లీయంగా వినిపిస్తూ వైసీపీకి ఓ విధంగా ఝ‌ల‌క్ ఇచ్చింది.

విశాఖ జిల్లా, ఎండాడ గ్రామ ప‌రిధిలో రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల‌ను (ఒక‌టి మ‌రియు ఆరో నంబ‌ర్ ప్లాట్ల‌ను) ఎలా అమ్ముతార‌ని ప్ర‌శ్నిస్తూ వెల‌గ‌పూడి రామకృష్ణ అనే ఎమ్మెల్యే (విశాఖ తూర్పు ఎమ్మెల్యే) పిటిష‌న్ దాఖలు చేశారు. దీనిపై వాద‌న‌లు వినిపించిన పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది పేద మ‌రియు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు 2007లో వైఎస్సార్ హ‌యాంలో రాజీవ్ స్వ‌గృహ‌ను తీసుకువ‌చ్చార‌ని, ఇందులో భాగంగా 2009లో 54.19 ఎక‌రాల‌ను కేటాయిస్తే అందులో స్థ‌లాన్ని ఇప్పుడు ప్లాట్లుగా చేసి ఓపెన్ ఆక్ష‌న్ ద్వారా అమ్ముకోవాల‌ని చూడ‌డం ప్రాజెక్టు స్ఫూర్తికే విఘాతం అని న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. దీనిపై మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు ఇవ్వ‌వ‌ద్ద‌ని హైకోర్టుకు ప్ర‌భుత్వ త‌ర‌ఫున న్యాయ‌వాది అభ్య‌ర్థించినా, ఈ నెల 30 ప్లాట్ల విక్ర‌యం ఉంద‌ని అంటున్నారు క‌నుక ఉత్త‌ర్వులు ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

This post was last modified on June 22, 2022 9:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago