విలక్షణ నటుడు మాధవన్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేసిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. దేశం కోసం ఎంతో సేవ చేసి, చేయని నేరానికి దేశద్రోహం కేసు ఎదుర్కొని.. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఆ కేసు నుంచి బయటపడ్డ ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.
ముందు ఈ చిత్రానికి మాధవన్ హీరో, నిర్మాత మాత్రమే. కానీ తర్వాత తనే దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. కెరీర్లో మరే సినిమాకు పెట్టనంత సమయం ఈ సినిమా కోసం వెచ్చించాడతను. కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టుకే అంకితమై ఉన్న మాధవన్.. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తట్టుకున్నాడు. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ‘రాకెట్రీ’ ఎట్టకేలకు జులై 1న పలు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలు పంచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు మాధవన్.
ఈ చిత్రంలో తమిళ స్టార్ సూర్యతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలు పోషించినట్లు మాధవన్ తెలిపాడు. అంతే కాదు.. వాళ్లిద్దరూ పైసా పారితోషకం తీసుకోకుండా నటించినట్లు వెల్లడించాడు. ‘‘సూర్య తన అసిస్టెంట్లతో కలిసి ముంబయికి సొంత ఖర్చులతో షూటింగ్ కోసం వచ్చారు. తనతో పాటు టీం మొత్తానికి ప్రయాణ ఖర్చులు తనే పెట్టుకోవడమే కాదు.. హిందీ నుంచి తమిళంలో తన సంభాషణలు అనువదించిన వారి రెమ్యూనరేషన్ కూడా తానే భరించారు.
ఇక షారుఖ్ విషయానికొస్తే.. అతను హీరోగా నటించిన ‘జీరో’లో నేనో చిన్న అతిథి పాత్ర చేశా. ఆ టైంలోనే ఆయనకు ‘రాకెట్రీ’ కథాలోచన చెప్పా. కొన్నాళ్ల తర్వాత తన పుట్టిన రోజు వేడుకల్లో షారుఖ్ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమా తీస్తే తాను అతిథి పాత్ర చేస్తానన్నాడు. కొన్ని రోజుల తర్వాత దీని గురించి సరదాగా మెసేజ్ చేస్తే.. షారుఖ్ మేనేజర్ డేట్లు ఎప్పుడు కావాలని అడిగాడు. కానీ షారుఖ్ నటిస్తే ఆ పాత్ర ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో సమయం తీసుకుని దాన్ని బాగా తీర్చిదిద్దాక ఆయన్ని సంప్రదించాను’’ అని మాధవన్ వెల్లడించాడు.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…