మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైఖరి పార్టీ నేతలకు అర్ధమే కావటం లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తే పెద్దగా స్పందించలేదు. జిల్లాలోకి అడుగుపెట్టినపుడు దణ్ణం పెట్టేసి మాయమైపోయారు. రెండు రోజులు చంద్రబాబు జిల్లాలో తిరిగినా మళ్ళీ ఎక్కడా అడ్రస్ కనబడలేదు. మళ్ళీ మహానాడు వేదిక మీద మాత్రం ప్రత్యక్షమయ్యారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభ సందర్భంగా అఖిల తమ్ముడు జగద్విఖాత్యరెడ్డితో కలిసి వేదికమీద కనిపించారు.
వేదికమీద అఖిల కూర్చునున్నా ఎవరు కూడా పట్టించుకున్నట్లు లేదు. కాకపోతే మాజీమంత్రి కాబట్టి వేదికమీద కూర్చోవటానికి ఎవరు అడ్డుచెప్పలేదంతే. నిజానికి ఈమెను జిల్లాలోని నేతల్లో అత్యధికులు దూరం పెట్టేశారు. ఈమెకు ఎవరితోను పొసగడం లేదు. సీనియర్లను గౌరవించాలని కూడా మాజీమంత్రికి తెలియదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకనే ఈమెకు అందరు దూరంగానే ఉంటారు. పార్టీ సమావేశాలకు కూడా ఈమెను పిలవటం మానుకున్నారట.
చిన్నవయసులోనే కారుణ్య నియామకం కోటాలో మంత్రి అయిపోయిన అఖిల చాలా దుడుకు మనిషి. అందుకనే అందరితోను ఎప్పుడూ గొడవలు పడుతునే ఉంటారు. ఈ దంపతుల మీద హత్యాయత్నం, కిడ్నాపులు, ఫోర్జరీ, భూ ఆక్రమణల్లాంటి కేసులు చాలా ఉన్నాయి. గడచిన మూడేళ్ళల్లో టీడీపీ నేతల్లో ఇంతగా ఇమేజ్ డ్యామేజ్ అయిన నేత మరొకరు లేరనే చెప్పాలి. ఈ కారణంతోనే చంద్రబాబు, లోకేష్ కూడా ఈమెను దూరం పెట్టారని పార్టీలోనే టాక్ నడుస్తోంది.
అందుకనే ఈమె పార్టీ కార్యక్రమాలకు వచ్చినా ఎవరు పట్టించుకోరు, రాకపోయినా ఎవరూ పట్టించుకోరు. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో తానే టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తానని అఖిల నియోజకవర్గంలో చెప్పుకుంటు తిరుగుతున్నారు. అయితే ఈమెకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని ఈమె బద్ధ విరోధి, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. ఎందుకంటే ఇక్కడనుండి పోటీకోసం ఏవీ కూడా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహానాడుకు హాజరు కాకపోతే మొదటికే మోసం వస్తుందని అఖిల భయపడినట్లున్నారు. అందుకనే ఎవరు పట్టించుకోకపోయినా వేదిక మీద కూర్చున్నారు.
This post was last modified on May 29, 2022 10:45 am
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…