ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన తప్పులు తెలుసుకుంది. పార్టీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేసింది. ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న మహానాడులో పార్టీ పరిస్థితిపై పోస్టుమార్టం చేపట్టిన పార్టీ నేతలు.. రాష్ట్రం లో పార్టీ పరిస్థితిని పూర్తిగా అంచనా వేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరకు.. అందరూ కూడా.. పార్టీలోని లోపాలను ప్రస్తావించారు. సాధారణంగా.. పార్టీ అంతా బాగుందని పదే పదే చెప్పేస్థాయి నుంచి ఇప్పుడు తప్పులు ఎత్తి చూపుకునే పరిస్థితి రావడం మంచిదే.
ఎందుకంటే.. ఎవరో వచ్చి.. తమ తప్పులు చెప్పే కంటే.. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలే కంటే.. ముందు గానే.. టీడీపీ తనతప్పులు తెలుసుకోవడం.. మంచి పరిణామమే. దాదాపు 30 నియోజకవర్గాల్లో అసలు ఇంచా ర్జ్లే లేరని.. టీడీపీ ప్రస్తావించింది. ఇక, ఉన్న చోట్ల కూడా 40 నియోజకవర్గాల్లో అంతర్గత పోరు జోరుగా సాగుతోంది. ఇక, నియోజకవర్గాలకు ఇంచార్జ్లు ఉన్నప్పటికీ.. పార్టీలో ఆధిపత్య రాజకీయాలు సాగుతున్న పరిస్థితి 40 నియోజకవర్గాల్లో కనిపిస్తోందని తేల్చి చెప్పింది.
అంటే.. మొత్తంగా.. 120 నియోజకవర్గాలకు పైగానే.. టీడీపీ పరిస్థితి ఇబ్బందిగానే ఉందని.. పార్టీ అధినేత స్వయంగా ఒప్పుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి.. ఇప్పటి వరకు ఎందుకు సరిదిద్దలేక పోయారు..? అనేది ప్రధాన ప్రశ్న. అంతేకాదు… కనీసం.. ఇప్పటకైనా.. దీనిపి సరిదిద్దుతారా? అనేది కూడా ప్రధానమే! కానీ.. అసలు నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జ్లనను నియమించకపోయినా.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యులను నియమించారు.
సో.. వారైనా.. పార్టీని లైన్లో పెట్టాల్సిన అవసరం ఉందికదా.. అంటే.. దీనికి సమాధానం లభించడం లేదు. అదేసమయంలో మహిళా నేతలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే..వారు కూడా క్షేత్రస్థా యిలో పనిచేయడం లేదు. సో.. దీనిని బట్టి.. పార్టీ ఇలా ఇబ్బందుల్లో కూరుకుపోవడానికి అసలు కారణం.. నాయకులు లేకపోవడం కాదు.. ఉన్న నాయకుల్లోకలిసి మెలిసి పనిచేద్దాం.. అనే ధోరణి కనిపించకపోవ డం. అదేసమయంలో లోపాలు ఉన్న నియోజకవర్గాల్లో అధిష్టానం ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పులు గుర్తించడం కాదు.. తప్పులను సరిచేసే వ్యూహాలు.. అప్పుడే.. పార్టీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…