Political News

బాబు -జగన్ – బాబు … ఈ సంప్రదాయం కొనసాగాల్సిందేనా?

కొద్ది రోజుల క్రితం ఏపీలోని రాజకీయ పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చేలా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చాలా ఎక్కువగా వైరల్ అయ్యింది. ధాని సారాంశం ఏమంటే.. 151 మేకలు.. 23 పులులు.. అంటూ సింగిల్ లైన్ లో పెట్టిన ఈ పోస్టు ఎక్కువగా షేర్ అయ్యింది. తర్వాతేమైంది? అన్న విషయంలోకి వస్తే.. ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. గంటల తరబడి కూర్చోబెట్టారు. అంతేనా.. అలాంటి ఉదాహరణలు ఇటీవల కాలంలో చాలానే చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో పలు సందేహాల్ని వ్యక్తం చేస్తూ వచ్చిన సోషల్ మీడియా పోస్టును 65 ఏళ్ల మహిళ (ఆమె తెలుగుదేశం కార్యకర్త లేదంటే సానుభూతిపరురాలు అనుకుందాం) షేర్ చేసిన దానికి ఆమెపై సీఐడీ కేసు నమోదు చేయటమే కాదు.. విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీనికంటే సిత్రమైన విషయం మరొకటి ఉంది. ఎస్సీ వర్గానికి చెందిన మహిళతో తనకున్న బంధాన్ని తెంచుకొన్న బీసీ వర్గానికి చెందిన వ్యక్తి మరో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వివాహ ఆహ్వానాన్ని అందుకున్న టీడీపీ ముఖ్యనేతలు పెళ్లికి వెళ్లారు. వీరిపై పోలీసులు పెట్టిన కేసు ఏమిటో తెలుసా? ఎస్సీ.. ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం. ఇంతకూ.. ఆ కేసు పెట్టింది ఎవరి మీదనో తెలుసా? మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పల మీదా.

అంతేకాదు..ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లు కవర్ చేసిన మీడియా సంస్థలకు నోటీసులు అందుతున్నాయి. అయితే.. కవర్ చేసిన అందరికి కాకుండా.. కొందరికి మాత్రమే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ కు గనుల లీజును 50 ఏళ్లకు పొడిగింపుపై విపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. పలు విమర్శలు చేశారు. ఆ అంశంపై బాబుకు నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో బాబు వ్యాఖ్యల్ని ప్రచురించిన ఈనాడు.. ఆంధ్రజ్యోతిలకు నోటీసులు ఇచ్చారు. బాబు ప్రెస్ మీట్ ను టెలికాస్ట్ చేసిన మిగిలిన మీడియా సంస్థల్ని వదిలేయటం గమనార్హం.

ఇప్పుడీ అంశాల ప్రస్తావన ఎందుకంటే.. చంద్రబాబు ప్రభుత్వంలో.. ఇదే సోషల్ మీడియాలో జగన్ అండ్ కో పెట్టిన పోస్టులు.. చేసిన వ్యాఖ్యలు తక్కువేం కావు. కొన్ని సందర్భాల్లో మితిమీరిన పోస్టులు పెట్టిన వారిపై అప్పట్లో కేసులు పెట్టారు. దానికి సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు మాత్రం.. చిన్న విషయాలకు కేసులు పెట్టటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

పోస్టు పెడితే కేసులు.. కాస్త తీవ్రమైన వ్యాఖ్యానం జోడితే.. విచారణ తిప్పలు తప్పట్లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ తీరు ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. శ్రుతి మించి రాగాన పడేలా ఉండే పోస్టుల విషయంలో చూసిచూడనట్లుగా ఉండమని చెప్పట్లేదు. కాకుంటే..అన్నింటిని ఒకే గాటిన పెట్టటం సరికాదన్నదే చెప్పేది.

ఎందుకంటే.. అధికారం శాశ్వితం కాదు. ఇప్పుడు అలవాటు చేసిన తీరునే.. రేపొద్దున అధికారంలోకి వచ్చేవారు అనుసరించే ప్రమాదం ఉంటుందన్నది మర్చిపోకూడదు. అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నా.. విపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రబాబు హయాంలో తప్పులు జరిగి ఉండొచ్చు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టి ఉండొచ్చు. బాబు బ్యాచ్ చేసిన తప్పుల్నే.. జగన్ పరివారం ఎందుకు చేయాలి?

Satya

Recent Posts

మళ్లీ డీటిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

1 hour ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

2 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

3 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

3 hours ago

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ…

3 hours ago

మీనాక్షికి ఊరట దక్కలేదు!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…

3 hours ago