కొద్ది రోజుల క్రితం ఏపీలోని రాజకీయ పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చేలా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చాలా ఎక్కువగా వైరల్ అయ్యింది. ధాని సారాంశం ఏమంటే.. 151 మేకలు.. 23 పులులు.. అంటూ సింగిల్ లైన్ లో పెట్టిన ఈ పోస్టు ఎక్కువగా షేర్ అయ్యింది. తర్వాతేమైంది? అన్న విషయంలోకి వస్తే.. ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. గంటల తరబడి కూర్చోబెట్టారు. అంతేనా.. అలాంటి ఉదాహరణలు ఇటీవల కాలంలో చాలానే చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో పలు సందేహాల్ని వ్యక్తం చేస్తూ వచ్చిన సోషల్ మీడియా పోస్టును 65 ఏళ్ల మహిళ (ఆమె తెలుగుదేశం కార్యకర్త లేదంటే సానుభూతిపరురాలు అనుకుందాం) షేర్ చేసిన దానికి ఆమెపై సీఐడీ కేసు నమోదు చేయటమే కాదు.. విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది.
దీనికంటే సిత్రమైన విషయం మరొకటి ఉంది. ఎస్సీ వర్గానికి చెందిన మహిళతో తనకున్న బంధాన్ని తెంచుకొన్న బీసీ వర్గానికి చెందిన వ్యక్తి మరో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వివాహ ఆహ్వానాన్ని అందుకున్న టీడీపీ ముఖ్యనేతలు పెళ్లికి వెళ్లారు. వీరిపై పోలీసులు పెట్టిన కేసు ఏమిటో తెలుసా? ఎస్సీ.. ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం. ఇంతకూ.. ఆ కేసు పెట్టింది ఎవరి మీదనో తెలుసా? మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పల మీదా.
అంతేకాదు..ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లు కవర్ చేసిన మీడియా సంస్థలకు నోటీసులు అందుతున్నాయి. అయితే.. కవర్ చేసిన అందరికి కాకుండా.. కొందరికి మాత్రమే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ కు గనుల లీజును 50 ఏళ్లకు పొడిగింపుపై విపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. పలు విమర్శలు చేశారు. ఆ అంశంపై బాబుకు నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో బాబు వ్యాఖ్యల్ని ప్రచురించిన ఈనాడు.. ఆంధ్రజ్యోతిలకు నోటీసులు ఇచ్చారు. బాబు ప్రెస్ మీట్ ను టెలికాస్ట్ చేసిన మిగిలిన మీడియా సంస్థల్ని వదిలేయటం గమనార్హం.
ఇప్పుడీ అంశాల ప్రస్తావన ఎందుకంటే.. చంద్రబాబు ప్రభుత్వంలో.. ఇదే సోషల్ మీడియాలో జగన్ అండ్ కో పెట్టిన పోస్టులు.. చేసిన వ్యాఖ్యలు తక్కువేం కావు. కొన్ని సందర్భాల్లో మితిమీరిన పోస్టులు పెట్టిన వారిపై అప్పట్లో కేసులు పెట్టారు. దానికి సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు మాత్రం.. చిన్న విషయాలకు కేసులు పెట్టటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పోస్టు పెడితే కేసులు.. కాస్త తీవ్రమైన వ్యాఖ్యానం జోడితే.. విచారణ తిప్పలు తప్పట్లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ తీరు ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. శ్రుతి మించి రాగాన పడేలా ఉండే పోస్టుల విషయంలో చూసిచూడనట్లుగా ఉండమని చెప్పట్లేదు. కాకుంటే..అన్నింటిని ఒకే గాటిన పెట్టటం సరికాదన్నదే చెప్పేది.
ఎందుకంటే.. అధికారం శాశ్వితం కాదు. ఇప్పుడు అలవాటు చేసిన తీరునే.. రేపొద్దున అధికారంలోకి వచ్చేవారు అనుసరించే ప్రమాదం ఉంటుందన్నది మర్చిపోకూడదు. అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నా.. విపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రబాబు హయాంలో తప్పులు జరిగి ఉండొచ్చు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టి ఉండొచ్చు. బాబు బ్యాచ్ చేసిన తప్పుల్నే.. జగన్ పరివారం ఎందుకు చేయాలి?
This post was last modified on June 24, 2020 12:47 pm
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…