Movie News

30 ఏళ్ల తర్వాత మంచు శిఖరంలో మల్టీఫ్లెక్స్

చాలామందికి తెలీదు కానీ ఇది పచ్చి నిజం. జమ్ముకశ్మీర్ పేరు దేశ ప్రజలకు సుపరిచితం కావొచ్చు. కానీ.. అక్కడి జీవన విధానం మాత్రం మన అంచనాలకు భిన్నంగా ఉంటుంది. జమ్ము వరకు ఫర్లేదు కానీ కశ్మీర్ విషయంలో మాత్రం మనం ఊహించని ఎన్నో మనకు కనిపిస్తాయి. ఎక్కడి దాకానో ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లో చిన్న ఊరులో అయినా ఒక టూరింగ్ టాకీసు ఉంటుంది. కానీ.. కశ్మీర్ లో మాత్రం అందుకు భిన్నంగా.

కశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ విషయానికే వస్తే.. ఆ నగరంలో గడిచిన మూడు దశాబ్దాలుగా ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు. 1990లో ఉన్న ఉగ్రవాదుల ఉగ్ర హెచ్చరికలతో అక్కడ ఉన్న థియేటర్లను మూసేశారు. అప్పట్లో శ్రీనగర్ లో దాదాపు పది థియేటర్లు ఉండేవి. ఉగ్రవాదుల ప్రాబల్యం పెరిగిన తర్వాత వాటిని మూసేశారు. కట్ చేస్తే.. నేటి వరకూ థియేటర్ లేని పరిస్థితి. అంతేకాదు.. నైట్ లైఫ్ అంటే ఏమిటో అక్కడి వారికి అస్సలు తెలీదు.

ఇటీవల మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయాలతో కశ్మీర్ ఉడికిపోయినట్లు కనిపించినా.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి తగ్గట్లే.. తాజాగా శ్రీనగర్ లో ఒక మల్టీఫ్లెక్స్ నిర్మాణం జోరుగా సాగుతోంది. దీని నిర్మాణం పూర్తి అయ్యాక లైసెన్సు మంజూరు చేస్తారని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే 1990లో శ్రీనగర్ లో బాగా ప్రసిద్ధి చెందిన బ్రాడ్ వే సినిమా హాల్ కు (ఇప్పుడది మూత పడి ఉంది) ఎదురుగానే తాజా మల్టీఫ్లెక్స్ నిర్మాణం సాగుతుండటం గమనార్హం.

దీన్ని ధార్ కుటుంబానికి చెందిన ఎమ్‌ / ఎస్‌ తక్సల్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మిస్తోంది. ఇంతకాలం వినోదానికి దూరంగా ఉన్న కశ్మీరీ ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పుగా అభివర్ణిస్తున్నారు. మరీ.. నిర్మాణం పూర్తి అయి ప్రారంభమయ్యాక ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి. ఇప్పటివరకూ చెబుతున్న దాని ప్రకారం ఈ మల్టీఫ్లెక్సును 2021లో ప్రారంభిస్తారని చెబుతున్నారు. కశ్మీరీల లైఫ్ లో ఇదో కొత్త మలుపుగా పలువురు అభివర్ణిస్తున్నారు.

This post was last modified on June 24, 2020 1:19 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

2 hours ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

3 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

3 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

4 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

5 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

6 hours ago