Movie News

30 ఏళ్ల తర్వాత మంచు శిఖరంలో మల్టీఫ్లెక్స్

చాలామందికి తెలీదు కానీ ఇది పచ్చి నిజం. జమ్ముకశ్మీర్ పేరు దేశ ప్రజలకు సుపరిచితం కావొచ్చు. కానీ.. అక్కడి జీవన విధానం మాత్రం మన అంచనాలకు భిన్నంగా ఉంటుంది. జమ్ము వరకు ఫర్లేదు కానీ కశ్మీర్ విషయంలో మాత్రం మనం ఊహించని ఎన్నో మనకు కనిపిస్తాయి. ఎక్కడి దాకానో ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లో చిన్న ఊరులో అయినా ఒక టూరింగ్ టాకీసు ఉంటుంది. కానీ.. కశ్మీర్ లో మాత్రం అందుకు భిన్నంగా.

కశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ విషయానికే వస్తే.. ఆ నగరంలో గడిచిన మూడు దశాబ్దాలుగా ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు. 1990లో ఉన్న ఉగ్రవాదుల ఉగ్ర హెచ్చరికలతో అక్కడ ఉన్న థియేటర్లను మూసేశారు. అప్పట్లో శ్రీనగర్ లో దాదాపు పది థియేటర్లు ఉండేవి. ఉగ్రవాదుల ప్రాబల్యం పెరిగిన తర్వాత వాటిని మూసేశారు. కట్ చేస్తే.. నేటి వరకూ థియేటర్ లేని పరిస్థితి. అంతేకాదు.. నైట్ లైఫ్ అంటే ఏమిటో అక్కడి వారికి అస్సలు తెలీదు.

ఇటీవల మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయాలతో కశ్మీర్ ఉడికిపోయినట్లు కనిపించినా.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి తగ్గట్లే.. తాజాగా శ్రీనగర్ లో ఒక మల్టీఫ్లెక్స్ నిర్మాణం జోరుగా సాగుతోంది. దీని నిర్మాణం పూర్తి అయ్యాక లైసెన్సు మంజూరు చేస్తారని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే 1990లో శ్రీనగర్ లో బాగా ప్రసిద్ధి చెందిన బ్రాడ్ వే సినిమా హాల్ కు (ఇప్పుడది మూత పడి ఉంది) ఎదురుగానే తాజా మల్టీఫ్లెక్స్ నిర్మాణం సాగుతుండటం గమనార్హం.

దీన్ని ధార్ కుటుంబానికి చెందిన ఎమ్‌ / ఎస్‌ తక్సల్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మిస్తోంది. ఇంతకాలం వినోదానికి దూరంగా ఉన్న కశ్మీరీ ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పుగా అభివర్ణిస్తున్నారు. మరీ.. నిర్మాణం పూర్తి అయి ప్రారంభమయ్యాక ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి. ఇప్పటివరకూ చెబుతున్న దాని ప్రకారం ఈ మల్టీఫ్లెక్సును 2021లో ప్రారంభిస్తారని చెబుతున్నారు. కశ్మీరీల లైఫ్ లో ఇదో కొత్త మలుపుగా పలువురు అభివర్ణిస్తున్నారు.

This post was last modified on June 24, 2020 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

7 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago