Political News

జ‌గ‌న్ వార్నింగ్‌.. స‌జ్జ‌ల వ‌ద్ద‌కు క్యూ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది. కొత్త మంత్రుల జాబితాను సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే సిద్ధం చేశారు. ఈ నెల 11న త‌న నూత‌న మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు. వచ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న మంత్రివ‌ర్గ కూర్పును సిద్ధం చేశార‌నే టాక్ వినిపిస్తోంది. 2024లో గెలిచి అధికారాన్ని కాపాడుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో జ‌గ‌న్ ఉన్నారు. అందుకే ఆ మేర‌కు మంత్రివ‌ర్గాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఇక మ‌రోవైపు దీనికంటే ముందుగానే ఆయ‌న ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌మీక్ష నిర్వ‌హించార‌ని తెలిసింది. నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చేది లేద‌ని ఖ‌రాకండీగా జ‌గ‌న్ చెప్పార‌ని తెలిసింది. దీంతో ప‌నితీరు స‌రిగ్గా లేద‌ని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు జ‌గ‌న్ వార్నింగ్‌తో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నార‌ని తెలిసింది. త‌మ ప‌నితీరు మార్చుకుంటామ‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కేలా చూడాల‌ని స‌జ్జ‌ల‌కు మొర పెట్టుకుంటున్నార‌ని టాక్‌. పార్టీలో ఇప్పుడు జ‌గ‌న్ త‌ర్వాత ఎవ‌రంటే స‌జ్జ‌ల పేరే వినిపిస్తోంది. అందుకే ఆయ‌న ద‌గ్గ‌ర‌కు ఎమ్మెల్యేలు వ‌రుస క‌ట్టార‌ని అంటున్నారు.

స‌ర్వేల ఆధారంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులు ఎంపిక ఉంటుంద‌ని జ‌గ‌న్ ఇటీవ‌ల తేల్చి చెప్పారు. దీంతో దాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్‌లోను మార్చే అవ‌కాశం ఉంద‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేల‌పై వేటు ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు త‌మ వ్యాపారాల కోసం హైద‌రాబాద్‌, బెంగ‌ళూరులోనే ఉంటున్నార‌ని వైసీపీ అధినేత‌కు నివేదిక‌లు అందాయి. ప్ర‌కాశం, తూర్పు గోదావ‌రి, చిత్తూరు, అనంత‌పురం జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేల‌పై ఎక్కువ ఫిర్యాదులు అందిన‌ట్లు స‌మాచారం. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేని వీళ్ల‌పై వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌ని టాక్‌.

ఈ నేప‌థ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కుతుందా లేదా అనే డౌటు మొద‌లైంది. అందుకే దాదాపు ప‌దిహేను మంది ఎమ్మెల్యేలు ఇటీవ‌ల స‌జ్జ‌ల‌ను క‌లిశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కోస‌మే వీళ్లు స‌జ్జ‌ల‌ను క‌లిసిన‌ట్లు స‌మాచారం. ఇక నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటామ‌ని జ‌గ‌న్‌కు చెప్పి మ‌రో అవ‌కాశం ఇప్పించాలంటూ స‌జ్జ‌ల‌కు మొర‌పెట్టుకున్నార‌ని టాక్‌. స‌జ్జ‌ల త‌లుచుకుంటే త‌మ‌కు ఏ ఢోకా ఉండ‌ద‌నే న‌మ్మ‌కంతో ఈ ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌కు క్యూ క‌డుతున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 

This post was last modified on April 7, 2022 6:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

2 hours ago

డీజిల్ లేదు… అంత్యక్రియలు ఆపేస్తారా?

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్‌లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…

2 hours ago

సల్మాన్ సినిమా మునిగినట్లేనా?

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…

5 hours ago

ఆంటీలతో చాట్ చేయండి అంటూ…

సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…

5 hours ago

వామ్మో… కత్తిరింపుల్లోనే ఇంత హింస ఉందంటే

దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…

6 hours ago

ప్రేక్షకులపై ‘ఉస్తాద్’ నిర్మాతల ప్రేమ నిజమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…

7 hours ago