రామ్ గోపాల్ వర్మకు ఒకప్పుడు కోట్లమంది అభిమానులు ఉండేవారు. వారిలో చాలామందిని కేవలం అభిమానులు అనడంకంటే.. భక్తులు కూడా అనొచ్చేమో. కేవలం పోస్టర్ మీద రామ్ గోపాల్ వర్మ పేరు చూసి.. హీరో హీరోయిన్లెవరో కూడా చూడకుండా థియేటర్లకు పరుగులు పెట్టేవారు ఒకప్పటి యూత్. ఒక దశ దాటాక వర్మ ఫాం కోల్పోయినా.. కొన్ని పేలవమైన సినిమాలు తీస్తున్నా సరే.. ఆయన్ని నమ్మి థియేటర్లకూ వెళ్తూనే ఉన్నారు కొన్నేళ్ల వరకు.
కానీ గత దశాబ్ద కాలంలో వర్మ దర్శకుడిగా ఎంత పతనం అయిపోయాడో.. ఎంత నాసిరకం సినిమాలు తీస్తున్నాడో తెలిసిందే. ఇప్పుడు ఆయన్నుంచి ఖత్రా-డేంజరస్ (తెలుగులో మా ఇష్టం) అనే సినిమా వస్తోంది. ఇది ఇద్దరు లెస్బియన్ ల మధ్య నడిచే గాఢమైన ప్రేమ కథ. దీని ప్రోమోలు చూస్తే ఇదొక బి-గ్రేడ్ సినిమాలా కనిపిస్తోంది. ఒకప్పటి వర్మ వీరాభిమానులు కూడా ఆయన ఇలాంటి సినిమా తీయడం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో మీడియా వాళ్లు వర్మను ఇదే విషయమై ప్రశ్నించారు. మీ స్థాయికి తగ్గ సినిమాలు తీయట్లేదనే మాటకు మీరేమంటారు అని అడిగితే ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘‘నన్ను ఆసక్తికి గురి చేసిన అంశంతోనే నేను సినిమా చేస్తా. అది పది మంది కోసమా వంద మంది కోసమా అన్నది నా ఇష్టం. ఎంత బాగుంది, ఎంతమంది చూశారనే దాని కంటే ఎంతలో తీశారు ఎంత వచ్చిందనే విషయమే లాభాల్ని నిర్ణయిస్తుంది.
నేను తీసిన సినిమాలన్నీ నాకు లాభాలు తెచ్చిపెట్టినవే. అందుకే ఇంకా సినిమాలు చేయగలుగుతున్నా. నేను ఆశించిన ఫలితం నాకు వస్తోంది. పెద్ద స్టార్లు, పెద్ద బడ్జెట్లో సినిమాలు తీసే ఓపిక, సామర్థ్యం, తపన నాకు లేవు. నా సినిమాలను చూసి ఎలా ఉండేవాడు ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేవాళ్లు ఉంటారు. ఎవరైతే ఆ మాటలు అంటారో వాళ్లు పుట్టినప్పటి నుంచి బావిలో నుంచి బయటికి రాలేదన్నది నా అభిప్రాయం’’ అంటూ ఎప్పట్లాగే సమాధానం ఇచ్చాడు వర్మ.
This post was last modified on April 7, 2022 5:13 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…