రామ్ గోపాల్ వర్మకు ఒకప్పుడు కోట్లమంది అభిమానులు ఉండేవారు. వారిలో చాలామందిని కేవలం అభిమానులు అనడంకంటే.. భక్తులు కూడా అనొచ్చేమో. కేవలం పోస్టర్ మీద రామ్ గోపాల్ వర్మ పేరు చూసి.. హీరో హీరోయిన్లెవరో కూడా చూడకుండా థియేటర్లకు పరుగులు పెట్టేవారు ఒకప్పటి యూత్. ఒక దశ దాటాక వర్మ ఫాం కోల్పోయినా.. కొన్ని పేలవమైన సినిమాలు తీస్తున్నా సరే.. ఆయన్ని నమ్మి థియేటర్లకూ వెళ్తూనే ఉన్నారు కొన్నేళ్ల వరకు.
కానీ గత దశాబ్ద కాలంలో వర్మ దర్శకుడిగా ఎంత పతనం అయిపోయాడో.. ఎంత నాసిరకం సినిమాలు తీస్తున్నాడో తెలిసిందే. ఇప్పుడు ఆయన్నుంచి ఖత్రా-డేంజరస్ (తెలుగులో మా ఇష్టం) అనే సినిమా వస్తోంది. ఇది ఇద్దరు లెస్బియన్ ల మధ్య నడిచే గాఢమైన ప్రేమ కథ. దీని ప్రోమోలు చూస్తే ఇదొక బి-గ్రేడ్ సినిమాలా కనిపిస్తోంది. ఒకప్పటి వర్మ వీరాభిమానులు కూడా ఆయన ఇలాంటి సినిమా తీయడం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో మీడియా వాళ్లు వర్మను ఇదే విషయమై ప్రశ్నించారు. మీ స్థాయికి తగ్గ సినిమాలు తీయట్లేదనే మాటకు మీరేమంటారు అని అడిగితే ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘‘నన్ను ఆసక్తికి గురి చేసిన అంశంతోనే నేను సినిమా చేస్తా. అది పది మంది కోసమా వంద మంది కోసమా అన్నది నా ఇష్టం. ఎంత బాగుంది, ఎంతమంది చూశారనే దాని కంటే ఎంతలో తీశారు ఎంత వచ్చిందనే విషయమే లాభాల్ని నిర్ణయిస్తుంది.
నేను తీసిన సినిమాలన్నీ నాకు లాభాలు తెచ్చిపెట్టినవే. అందుకే ఇంకా సినిమాలు చేయగలుగుతున్నా. నేను ఆశించిన ఫలితం నాకు వస్తోంది. పెద్ద స్టార్లు, పెద్ద బడ్జెట్లో సినిమాలు తీసే ఓపిక, సామర్థ్యం, తపన నాకు లేవు. నా సినిమాలను చూసి ఎలా ఉండేవాడు ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేవాళ్లు ఉంటారు. ఎవరైతే ఆ మాటలు అంటారో వాళ్లు పుట్టినప్పటి నుంచి బావిలో నుంచి బయటికి రాలేదన్నది నా అభిప్రాయం’’ అంటూ ఎప్పట్లాగే సమాధానం ఇచ్చాడు వర్మ.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…