నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న కొత్త చిత్రం.. అంటే సుందరానికి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి వైవిధ్యమైన చిత్రాలతో తన అభిరుచిని, ప్రతిభను చాటుకున్న యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటి, ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజ్రీన్ కథానాయికగా నటిస్తోంది.
మొత్తంగా క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ భలే ఫన్నీగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. ఇక అంటే సుందరానికి టీం పాటల ప్రమోషన్ మొదలుపెట్టింది. సినిమా నుంచి ముందుగా పంచెకట్టు అనే పాటను లాంచ్ చేశారు. దీని ప్రోమో చూసి పాట మీద అంచనాలు పెరిగాయి. రాజ రాజ చోర దర్శకుడు హాసిత్ గోలి ఈ పాట రాయగా.. ప్రముఖ గాయని, పద్మశ్రీ అవార్డు గ్రహీత అరుణ సాయిరాం ఈ పాటను ఆలపించడం విశేషం. ప్రోమో చూసి ఎంతో ఊహించుకున్న శ్రోతలను ఈ పాట అనుకున్నంతగా ఆకట్టుకోవడం లేదు.
అంత పెద్ద గాయనితో పాట పాడించారంటే ఆమె గానం ఎలా ఉంటుందో అని ఆసక్తిగా చూస్తే.. అసలు వాయిస్సే వినిపించకుండా వాయిద్యాలతో హోరెత్తించేశాడు సంగీత దర్శకుడు వివేక్ సాగర్. మామూలుగా అతను తన పాటల్లో గాత్రం బాగా వినిపించేలాగే చూసుకుంటాడు. వాయిద్యాల హోరు ఈ స్థాయిలో ఉండదు. కానీ ఈ పాట అందుకు భిన్నం.
ఒక లెజెండరీ సింగర్తో పాట పాడిస్తూ.. ఆమె గొంతును గౌరవించినట్లే అనిపించలేదు. లిరిక్స్ సైతం గందరగోళంగా అనిపించాయి. ఏం రాశారో.. ఏం పాడారో.. ఏం కంపోజ్ చేశారో అని అయోమయానికి గురయ్యేలా ఉందీ పాట. ఏదో ప్రయోగాత్మకంగా చేయాలని ప్రయత్నిస్తే అది బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. వినగా వినగా ఏమైనా ఈ పాట ఎక్కుతుందేమో కానీ.. ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం గోల గోలగా అనిపిస్తోంది.
This post was last modified on April 7, 2022 6:24 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…