Political News

చిన‌జీయ‌ర్‌తో గ్యాప్ లేదు.. కేసీఆర్

చినజీయర్ స్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది.  ఎందుకంటే ముచ్చింతల్‌లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ముచ్చింతల్ కార్యక్రమానికి ముందు నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంపై కేసీఆర్ సీరియస్‌గా రియాక్టయ్యారు. ‘‘చినజీయర్‌తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదు. చినజీయర్‌తో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు’’  అని తాజాగా ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఎవ‌రూకూడా అతిగా ఆలోచించ‌వ‌ద్ద‌ని దీనిపై సూచించారు. “ప్ర‌తి విష‌యాన్నీ రాద్ధాంతం చేస్తారేమ‌యా?  నాకు తెల్వ‌క అడుగుతున్నా.. ప్ర‌తి విష‌యం ఫ‌స్ట్ పేజీలల్లో రాసుకునేలా చేస్తారా“ అని త‌న‌దైన శైలిలో ఆయ‌న మీడియాను ప్ర‌శ్నించారు. దీంతో ఈ వివాదానికి తెర‌ప‌డిన‌ట్టేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ, ఎక్క‌డా తెర‌ప‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. సీఎం స్వ‌యంగా చెప్పినాకూడా.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చిన‌జీయ‌ర్‌కు, సీఎంకు మ‌ధ్య గ్యాప్ నిజ‌మేన‌ని అంటున్నారు.

ఎందుకంటే.. తాజాగా యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన.. మహాకుంభ సంప్రోక్షణను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఈ నెల 28న  నిర్వహించనున్నారు.  ఇక్కడే అసలు ముచ్చట ఉంది. యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చింది చినజీయర్ స్వామే. ఆలయ పున:నిర్మాణం అంతా ఆయన సూచనలు, సలహాలతోనే నిర్మించారు. యాదాద్రి ఆలయ పున:నిర్మాణానికి ముగ్గు వేసిన చినజీయర్ స్వామి లేకుండానే ఈ ఉద్ఘాటన  కార్య‌క్ర‌మం జరగుతోంది. ఇదే విషయంపై ఇటీవల పిలిస్తే యాదాద్రి పోతామని లేక‌పోతే.. దూరంగా ఉండి చూస్తామ‌ని.. చినజీయర్ మీడియా ముఖంగా తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు చినజీయర్‌కు వెళ్లినట్లు కనబడలేదు. అందరూ ఆహ్వానితులే అంటున్నారనే తప్ప ప్రత్యేకంగా చినజీయర్‌ను ఆహ్వానించిన దాఖలాలు కనిపించడం లేదు. దీనిని బ‌ట్టి.. `గ్యాప్‌` నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తంలో ఏం జ‌రిగిందంటే..

ముచ్చింతల్‌లో అట్టహానంగా ఏర్పాటు చేసిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ పోలేదు. కొంతకాలంగా కేంద్రంతో తలపడేందుకు కేసీఆర్ సిధ్దమవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్, బీజేపీ మధ్య ఎలాంటి పరిస్థితి ఉందంటే ఢీ అంటే డీ అనే స్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీని చినజీయర్‌ స్వామి గొప్పగా కొనియాడారు. మోడీ పాలనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆయనను శ్రీరామచంద్రునితో పోల్చారు. ఈ విగ్రహావిష్కరణకు మోడీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరని కీర్తించారు. అసలే కాకమీద ఉన్న కేసీఆర్‌కు ఈ పొగడ్తలు మరింత ఆగ్రహం తెప్పించాయి.

రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతోపాటు వేడుకలు నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ పోలేదు. అయినా ఆయనను రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. మహా విగ్రహావిష్కరణ ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని కేసీఆర్‌ కోసమే వాయిదా వేశారని ప్రచారం సాగింది. అయినా కేసీఆర్ శాంతికల్యాణానికి వెళ్లలేదు.  ఈ నేప‌థ్యంలోనే జీయ‌ర్‌తో కేసీఆర్‌కు వివాదాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు అవేవీ లేవ‌ని సీఎం అన్నా కూడా.. యాదాద్రి విష‌యం ప‌రిశీలిస్తే.. నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 22, 2022 9:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

20 minutes ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

5 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

10 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

11 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

11 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

11 hours ago