Political News

చిన‌జీయ‌ర్‌తో గ్యాప్ లేదు.. కేసీఆర్

చినజీయర్ స్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది.  ఎందుకంటే ముచ్చింతల్‌లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ముచ్చింతల్ కార్యక్రమానికి ముందు నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంపై కేసీఆర్ సీరియస్‌గా రియాక్టయ్యారు. ‘‘చినజీయర్‌తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదు. చినజీయర్‌తో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు’’  అని తాజాగా ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఎవ‌రూకూడా అతిగా ఆలోచించ‌వ‌ద్ద‌ని దీనిపై సూచించారు. “ప్ర‌తి విష‌యాన్నీ రాద్ధాంతం చేస్తారేమ‌యా?  నాకు తెల్వ‌క అడుగుతున్నా.. ప్ర‌తి విష‌యం ఫ‌స్ట్ పేజీలల్లో రాసుకునేలా చేస్తారా“ అని త‌న‌దైన శైలిలో ఆయ‌న మీడియాను ప్ర‌శ్నించారు. దీంతో ఈ వివాదానికి తెర‌ప‌డిన‌ట్టేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ, ఎక్క‌డా తెర‌ప‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. సీఎం స్వ‌యంగా చెప్పినాకూడా.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చిన‌జీయ‌ర్‌కు, సీఎంకు మ‌ధ్య గ్యాప్ నిజ‌మేన‌ని అంటున్నారు.

ఎందుకంటే.. తాజాగా యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన.. మహాకుంభ సంప్రోక్షణను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఈ నెల 28న  నిర్వహించనున్నారు.  ఇక్కడే అసలు ముచ్చట ఉంది. యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చింది చినజీయర్ స్వామే. ఆలయ పున:నిర్మాణం అంతా ఆయన సూచనలు, సలహాలతోనే నిర్మించారు. యాదాద్రి ఆలయ పున:నిర్మాణానికి ముగ్గు వేసిన చినజీయర్ స్వామి లేకుండానే ఈ ఉద్ఘాటన  కార్య‌క్ర‌మం జరగుతోంది. ఇదే విషయంపై ఇటీవల పిలిస్తే యాదాద్రి పోతామని లేక‌పోతే.. దూరంగా ఉండి చూస్తామ‌ని.. చినజీయర్ మీడియా ముఖంగా తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు చినజీయర్‌కు వెళ్లినట్లు కనబడలేదు. అందరూ ఆహ్వానితులే అంటున్నారనే తప్ప ప్రత్యేకంగా చినజీయర్‌ను ఆహ్వానించిన దాఖలాలు కనిపించడం లేదు. దీనిని బ‌ట్టి.. `గ్యాప్‌` నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తంలో ఏం జ‌రిగిందంటే..

ముచ్చింతల్‌లో అట్టహానంగా ఏర్పాటు చేసిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ పోలేదు. కొంతకాలంగా కేంద్రంతో తలపడేందుకు కేసీఆర్ సిధ్దమవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్, బీజేపీ మధ్య ఎలాంటి పరిస్థితి ఉందంటే ఢీ అంటే డీ అనే స్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీని చినజీయర్‌ స్వామి గొప్పగా కొనియాడారు. మోడీ పాలనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆయనను శ్రీరామచంద్రునితో పోల్చారు. ఈ విగ్రహావిష్కరణకు మోడీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరని కీర్తించారు. అసలే కాకమీద ఉన్న కేసీఆర్‌కు ఈ పొగడ్తలు మరింత ఆగ్రహం తెప్పించాయి.

రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతోపాటు వేడుకలు నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ పోలేదు. అయినా ఆయనను రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. మహా విగ్రహావిష్కరణ ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని కేసీఆర్‌ కోసమే వాయిదా వేశారని ప్రచారం సాగింది. అయినా కేసీఆర్ శాంతికల్యాణానికి వెళ్లలేదు.  ఈ నేప‌థ్యంలోనే జీయ‌ర్‌తో కేసీఆర్‌కు వివాదాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు అవేవీ లేవ‌ని సీఎం అన్నా కూడా.. యాదాద్రి విష‌యం ప‌రిశీలిస్తే.. నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 22, 2022 9:39 am

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

5 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

48 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago