Political News

చిన‌జీయ‌ర్‌తో గ్యాప్ లేదు.. కేసీఆర్

చినజీయర్ స్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది.  ఎందుకంటే ముచ్చింతల్‌లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ముచ్చింతల్ కార్యక్రమానికి ముందు నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంపై కేసీఆర్ సీరియస్‌గా రియాక్టయ్యారు. ‘‘చినజీయర్‌తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదు. చినజీయర్‌తో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు’’  అని తాజాగా ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఎవ‌రూకూడా అతిగా ఆలోచించ‌వ‌ద్ద‌ని దీనిపై సూచించారు. “ప్ర‌తి విష‌యాన్నీ రాద్ధాంతం చేస్తారేమ‌యా?  నాకు తెల్వ‌క అడుగుతున్నా.. ప్ర‌తి విష‌యం ఫ‌స్ట్ పేజీలల్లో రాసుకునేలా చేస్తారా“ అని త‌న‌దైన శైలిలో ఆయ‌న మీడియాను ప్ర‌శ్నించారు. దీంతో ఈ వివాదానికి తెర‌ప‌డిన‌ట్టేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ, ఎక్క‌డా తెర‌ప‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. సీఎం స్వ‌యంగా చెప్పినాకూడా.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చిన‌జీయ‌ర్‌కు, సీఎంకు మ‌ధ్య గ్యాప్ నిజ‌మేన‌ని అంటున్నారు.

ఎందుకంటే.. తాజాగా యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన.. మహాకుంభ సంప్రోక్షణను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఈ నెల 28న  నిర్వహించనున్నారు.  ఇక్కడే అసలు ముచ్చట ఉంది. యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చింది చినజీయర్ స్వామే. ఆలయ పున:నిర్మాణం అంతా ఆయన సూచనలు, సలహాలతోనే నిర్మించారు. యాదాద్రి ఆలయ పున:నిర్మాణానికి ముగ్గు వేసిన చినజీయర్ స్వామి లేకుండానే ఈ ఉద్ఘాటన  కార్య‌క్ర‌మం జరగుతోంది. ఇదే విషయంపై ఇటీవల పిలిస్తే యాదాద్రి పోతామని లేక‌పోతే.. దూరంగా ఉండి చూస్తామ‌ని.. చినజీయర్ మీడియా ముఖంగా తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు చినజీయర్‌కు వెళ్లినట్లు కనబడలేదు. అందరూ ఆహ్వానితులే అంటున్నారనే తప్ప ప్రత్యేకంగా చినజీయర్‌ను ఆహ్వానించిన దాఖలాలు కనిపించడం లేదు. దీనిని బ‌ట్టి.. `గ్యాప్‌` నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తంలో ఏం జ‌రిగిందంటే..

ముచ్చింతల్‌లో అట్టహానంగా ఏర్పాటు చేసిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ పోలేదు. కొంతకాలంగా కేంద్రంతో తలపడేందుకు కేసీఆర్ సిధ్దమవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్, బీజేపీ మధ్య ఎలాంటి పరిస్థితి ఉందంటే ఢీ అంటే డీ అనే స్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీని చినజీయర్‌ స్వామి గొప్పగా కొనియాడారు. మోడీ పాలనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆయనను శ్రీరామచంద్రునితో పోల్చారు. ఈ విగ్రహావిష్కరణకు మోడీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరని కీర్తించారు. అసలే కాకమీద ఉన్న కేసీఆర్‌కు ఈ పొగడ్తలు మరింత ఆగ్రహం తెప్పించాయి.

రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతోపాటు వేడుకలు నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ పోలేదు. అయినా ఆయనను రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. మహా విగ్రహావిష్కరణ ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని కేసీఆర్‌ కోసమే వాయిదా వేశారని ప్రచారం సాగింది. అయినా కేసీఆర్ శాంతికల్యాణానికి వెళ్లలేదు.  ఈ నేప‌థ్యంలోనే జీయ‌ర్‌తో కేసీఆర్‌కు వివాదాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు అవేవీ లేవ‌ని సీఎం అన్నా కూడా.. యాదాద్రి విష‌యం ప‌రిశీలిస్తే.. నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

3 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

5 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

6 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

6 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

6 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

6 hours ago