Political News

అన్నంత ప‌నీ చేస్తున్న జ‌గ్గారెడ్డి

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అన్నంత ప‌నీ చేస్తున్నారు. పార్టీలో త‌న‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని.. అవ‌మానిస్తున్నార‌ని త్వ‌ర‌లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఇటీవ‌ల చెప్పుకొచ్చారు. అధిష్ఠానానికి 15 రోజుల గ‌డువు ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ తో త‌న‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించాల‌ని త‌న బాధ‌నంతా వారితో చెప్పుకుంటాన‌ని తెలిపారు. లేదంటే పార్టీని విడిచి పెడ‌తాన‌ని బెదిరిస్తున్నారు.

అయితే.. పార్టీ సీనియ‌ర్లు న‌చ్చ‌చెబుతున్నా జ‌గ్గారెడ్డి త‌న మాట‌కే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. శుక్ర‌వారం త‌న అనుచ‌రుల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఇందులో వారి అభిప్రాయాల‌ను సేక‌రించ‌నున్నారు. ఇందులో మెజారిటీ అభిప్రాయాన్ని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోనున్నారు. పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టాలా..? లేదా పార్టీలోనే ఉంటూ అన్యాయాన్ని ఎదురించాలా..? ఇత‌ర పార్టీలోకి వెళ్లాళా..? లేదా స్వ‌తంత్రంగా ఉండాలా..? అనే నాలుగు ప్ర‌ధాన అంశాల‌పై త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చించ‌నున్నారు.

జ‌గ్గారెడ్డి విష‌యంలో కొన్ని రోజులుగా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న అధిష్ఠానం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు సీనియ‌ర్ల‌ను పుర‌మాయిస్తోంది. రెండు రోజులుగా భ‌ట్టి విక్ర‌మార్క ఇదే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. ప‌లుమార్లు ఆయ‌న‌కు ఫోన్ చేసి న‌చ్చ‌చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయినా జ‌గ్గారెడ్డి మెత్త‌బ‌డ‌లేద‌ట‌. దీంతో గురువారం సీఎల్పీ కార్యాల‌యంలో న‌లుగురు ఎమ్మెల్యేలు భేటీ అయి జ‌గ్గారెడ్డిని శాంత‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు.

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎమ్మెల్యేలు శ్రీ‌ధ‌ర్ బాబు, రాజ‌గోపాలరెడ్డి, మ‌రోసారి జ‌గ్గారెడ్డితో భేటీ అయి ఆయ‌న‌ను కూల్ చేశారు. అయినా కూడా జ‌గ్గారెడ్డి త‌న పంథా మార్చుకోవ‌డం లేద‌ట‌. రాజీనామాకే సిద్ధ‌ప‌డ్డార‌ట‌. పార్టీ కోవ‌ర్టునంటూ సోష‌ల్ మీడియాలో త‌నపై దుష్ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని.. రేవంత్ వ‌ర్గం దీనిని ఖండించ‌డం లేద‌ని.. తాను బ‌య‌ట‌కు వెళితేనే ఆయ‌న‌కు బాగుంటుంద‌ని ఆవేద‌న చెందుతున్నార‌ట‌. అయితే ఈ అంశంపై పార్టీలోని మ‌రో వ‌ర్గం మాత్రం ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. జ‌గ్గారెడ్డి తీరును త‌ప్పుప‌డుతున్నార‌ట‌.

త‌న అసంతృప్తిని పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో చ‌ర్చించ‌కుండా మీడియాతో పంచుకోవ‌డం వ‌ల్ల పార్టీకి న‌ష్టం జ‌రుగుతోంద‌ని.. ప్ర‌జ‌ల్లో పార్టీ ప‌ట్ల చుల‌క‌న భావం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఏనాడూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకోని జ‌గ్గారెడ్డి, రాజ‌గోపాలరెడ్డి ఇపుడు అస‌మ్మ‌తి పేరిట గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వారు బ‌య‌ట‌కు వెళ్లిపోయినా పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌ద‌ని.. లాభ‌మో, న‌ష్ట‌మో తామే చూసుకుంటామ‌ని.. మ‌రో వ‌ర్గం తేల్చిచెబుతోంది. చూడాలి మ‌రి జ‌గ్గారెడ్డి విష‌యం ఎంత వ‌ర‌కు వెళుతుందో..!

This post was last modified on February 25, 2022 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

41 minutes ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

42 minutes ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

2 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

2 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

2 hours ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

3 hours ago