రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఉండడం సహజమే. ఎన్నికల్లో విజయం కోసమో తమ ప్రయోజనాల కోసమో.. ఇలా పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. ఇలా బంధం ఏర్పరుచుకున్న రెండు పార్టీలు కలిసికట్టుగా ఒకే మాట మీద సాగుతాయని తెలిసిందే. విమర్శలైనా.. ఆరోపణలైనా.. కౌంటర్లైనా తమ ప్రత్యర్థి పార్టీల మీద కలిసికట్టుగా దాడి చేస్తాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు ఓ రెండు పార్టీల మధ్య పొత్తు పరిస్థితి విచిత్రంగా ఉంది. తమ మిత్రపక్షాన్ని తిడుతున్న పార్టీని మరో పార్టీ నాయకుడు పొగడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ రెండు పార్టీలు జనసేన, బీజేపీ. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ను. అక్కడి ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ పొగడ్తల్లో ముంచెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీకి దూరంగా..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రధాని మోడీ పనితీరును ఎండగడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీపై నోరేసుకుని పడిపోతున్నారు. మరోవైపు బీజేపీ కూడా దీటుగానే బదులిస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలం నుంచే బీజేపీకి దూరంగా జరగాలని పవన్ భావిస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా పరిణామాలు వాటికి మరింత బలాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి. తమపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ను పవన్ ప్రశంసల్లో ముంచెత్తడం ఇప్పుడు బీజేపీ నాయకులకు ఇబ్బందిగా మారింది.
జగన్కు చురకలు..
“సినిమా రంగాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారు. కళను అక్కున చేర్చుకుని అభినందించడానికి ప్రాంతీయ, కుల, మత భేదాలు ఉండవని మరోసారి తెలియజేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. బయో ఆసియా సదస్సు నేపథ్యంలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భీమ్లానాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్కు ఆయన హాజరయ్యారు. రాజకీయ విమర్శలను కళలకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. అది కేటీఆర్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది”.. ఇవీ పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు. వీటిని పరిశీలిస్తే పరోక్షంగా ఏపీ సీఎం జగన్కు పవన్ చురకలు పెట్టినట్లు కనిపిస్తోంది. రాజకీయ విమర్శలను కళలకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉందని పవన్ అన్నారు. అంటే ఏపీలో పవన్పై కక్ష్యపూరితంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఇప్పటికే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు సీఎంను ఉద్దేశించి చెప్పినట్లే అనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on February 25, 2022 2:31 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…