Political News

స‌మ‌తా సూత్ర‌మే రాజ్యాంగానికి పునాది: ప్ర‌ధాని మోడీ

రామానుజాచార్యుల సమతాసూత్రమే మన రాజ్యాంగానికీ స్ఫూర్తి అని ప్రధాని స్పష్టం చేశారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేడ్కర్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో ఐక్యత, సమానతదీ కీలకపాత్ర అని మోడీ వెల్లడించారు. హైదరాబాద్‌ ఏర్పాటులో సర్దార్‌ పటేల్‌ కీలకపాత్ర పోషించారన్న మోదీ.. ఆయన చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించిందని గుర్తు చేశారు. ఐక్యతా విగ్రహంతో సర్దార్‌ పటేల్‌ను సత్కరించుకున్నామన్నారు. వసంత పంచమి వేళ రామానుజ విగ్రహావిష్కరణ సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు.

రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయన్నారు. మన సంస్కృతిలో గురువే జ్ఞానానికి కేంద్రమన్న మోడీ.. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని ఆయన చెప్పారు. రామానుజాచార్యుల ప్రతిభ, వైరాగ్యం ఆదర్శాలకు ప్రతీక అని వెల్లడించారు. రామానుజాచార్యులు ముందు తరాలకు ప్రేరణగా నిలిచారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శ్రీరామనగరంలో 108 దివ్య దేశ మందిరాల ఏర్పాటు అద్భుతమన్న ప్రధాని.. దేశమంతా తిరిగి ఆలయాలు చూసిన అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

చినజీయర్‌ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారని.. ఆ యజ్ఞఫలం 130 కోట్ల ప్రజలకు అందాలని మోదీ కోరుకున్నారు. మనదేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయన్న మోడీ.. రామానుజాచార్యుల విశిష్టాద్వైతం మనకు ప్రేరణ అని తెలిపారు. సమతామూర్తి బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు.  అంధవిశ్వాసాలను రామానుజాచార్యులు పారదోలారన్న ప్రధాని.. భక్తికి కులం, జాతి లేదని చాటిచెప్పారని గుర్తుచేశారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులని తెలిపారు. ఆ సమతామూర్తి దళితులను ఆలయ ప్రవేశం చేయించారని ప్రధాని  చెప్పారు.

తెలంగాణ గొప్ప పర్యాటక ప్రాంతంగా ఎదుగుతోందని ప్రధాని ప్రశంసించారు. రామప్ప ఆలయానికి ఇప్పటికే యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామపురస్కారం లభించిందని ప్రధాని వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచఖ్యాతి గడిస్తోందని ప్రధాని తెలిపారు. ప్రపంచ పర్యాటక తలమానికంగా సమతా విగ్రహం వెలుగొందుతుందని చెప్పారు.

This post was last modified on February 5, 2022 8:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

3 hours ago

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

3 hours ago

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…

3 hours ago

సుకుమార్ శిష్యుడికి ‘మెగాస్టార్’ గ్రీన్ సిగ్నల్ ?

కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…

4 hours ago

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…

4 hours ago

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం…

5 hours ago