Categories: Political News

మోడీని ఫిక్స్ చేయబోయిన ట్రంప్.. రివర్స్ లో బుక్ చేసిన మోడీ

తెలివితేటలు ఎవరి సొత్తు కాదు. ఎత్తుకు పైఎత్తు. దెబ్బకు దెబ్బ మామూలే. ఇద్దరి వ్యక్తుల మధ్య డీల్ కు ఉండే సాధారణ లక్షణాలే.. రెండు దేశాల మధ్య జరిగే ఒప్పందాల్లోనూ కనిపిస్తాయి. అయితే.. ఒప్పందం ఏదైనా.. తన ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఎదుటోడికి మేలు చేసేలా నిర్ణయాన్ని తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే.. జరిగే నష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కరోనాకు మందు లేని వేళ.. అంతో ఇంతో ప్రభావం చూపిస్తున్నదంటే అది హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలే.

ఈ విషయాన్ని ఇప్పటికే పలు దేశాలు తేల్చగా.. అమెరికాలో విరుచుకుపడుతున్న కరోనాకు ఔషధంగా పని చేస్తున్న ఔషధం భారత్ లో బాగా దొరుకుతుంది. అందుకే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా లైన్లోకి వచ్చేశారు. ప్రధాని మోడీతో మాట్లాడారు. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల అవసరం చాలా ఉందని.. తమకు సప్లై చేయాలని కోరారు.

అందుకు ప్రధాని మోడీ ఓకే అన్నట్లుగా ప్రచారం జరిగింది. తమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మిత్రుడు మాట ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. నిజానికి ఇదే మోడీకి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఇద్దరు దేశాధినేతలు మాట్లాడుకున్న సంభాషణ సారాంశాన్ని ట్వీట్ రూపంలో ట్రంప్ పోస్టు చేయటంతో ఆరా మొదలైంది. ట్రంప్.. మోడీ మధ్య ఫోన్ కాల్ సారాంశమేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తనను రిక్వెస్టు చేసిన ట్రంప్.. ట్వీట్ పోస్టు చేసిన నేపథ్యంలో మోడీ మైండ్ సెట్ మారిందని చెబుతున్నారు.

ట్రంప్ మాటలకు ఓకే చెప్పిన మోడీ.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధ ఎగుమతిపై మరిన్ని ఆంక్షలు విధించటం ఇప్పుడు సంచలనంగా మారింది. కరోనాపై పోరాటంతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తారు ట్రంప్. అంతటి కీలకమైన ఔషదాన్ని అమెరికాకు పంపిస్తే..తర్వాతికాలంలో భారీగా మూల్యం చెల్సించాల్సి వస్తుందన్న సందేహంతో పాటు.. దేశంలో కరోనా విస్తరిస్తున్న వేళ.. ఈ ఔషధ అవసరం ఎక్కువగా ఉంటుంది.

అందుకే.. మిత్రుడు ట్రంప్ చేసిన ట్వీట్ ను లైట్ తీసుకొని మరీ.. దేశం కోసం.. ప్రజల ప్రయోజనాల కంటే తనకేమీ ముఖ్యం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. మోడీ మాస్టారు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పాలి. ట్రంప్ దగ్గర స్నేహం కంటే.. మోడీకి దేశ ప్రజల వద్ద మైలేజీ చాలా ముఖ్యమన్ని ఆయనకు తెలిసినంత మరెవరికీ తెలీదని చెప్పాలి. తాజా ఎపిసోడ్ తో ఆ విషయం ట్రంప్ కు కూడా బాగానే అర్థం కావటం ఖాయం. ట్వీట్ పెట్టకుండా ఉండే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏమైనా.. సాయం అడిగిన ట్రంప్ కు.. నిక్కచ్చిగా వ్యవహరించి మోడీ తీరు ఆయన ఇమేజ్ గ్రాఫ్ ను దేశప్రజల్లో మరింత భారీగా పెంచేసిందని చెప్పాలి.

This post was last modified on April 9, 2020 6:48 pm

Share

Recent Posts

సౌండ్ సరిపోతుందా శ్రీనివాసా

వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…

1 hour ago

బెజవాడ నడిబొడ్డున ముద్రగడ విగ్రహం

కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…

3 hours ago

కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…

3 hours ago

యువత తిరగబడింది… రాజ్యం ఉలికిపడింది!

నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…

4 hours ago

శ్రీగౌరి నేర్చుకోవాల్సిన బేబీ పాఠాలు

మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి  అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…

5 hours ago

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…

6 hours ago