నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి రావడం ఆలస్యం సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గతంలో కూలి, కాంతార లాంటి వాటికి కూడా హైక్స్ ఇచ్చారు కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఏ మాత్రం తొందరపడినా దాని తాలూకు పరిణామాలు నేరుగా ఓపెనింగ్స్ మీద పడేలా ఉన్నాయి. టాక్సిక్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఎందుకంటే పెద్ది తర్వాత అంటే జూన్ మూడో వారం నుంచి ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండా బోలెడు సినిమాలు చూశారు. మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, విశ్వనాథ్ అండ్ సన్స్, ఒడిస్సి,. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మొదలైనవన్నీ విజయవంతంగా మాములు ధరలకే నిర్మాతలకు కనకవర్షం కురిపించాయి. ఆడియన్స్ కూడా ఇదేదో బాగుందని వాటికి బాగా అలవాటు పడ్డారు. ఇరుముడికి కూడా పెంపు అడగలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా టాక్సిక్ కనక పెంపు తీసుకుంటే రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇది తెలుగు సినిమా కాదు. తెలుగు వాళ్ళు తీయలేదు. తెలుగు హీరో నటించలేదు. టెక్నీషియన్స్ ఎవరూ తెలుగు వాళ్ళు కాదు. అంతెందుకు టాలీవుడ్ యాక్టర్స్ ఎవరున్నారు అంటే ఠక్కున సమాధానం దొరకదు. అలాంటప్పుడు స్పెషల్ ట్రీట్ మెంట్ ఎందుకు ఇవ్వాలనేది మూవీ లవర్స్ ప్రశ్న. జిఓ వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఇంత చర్చ జరుగుతోంది.
ఈ విషయం గురించే కాదు టాక్సిక్ లో బోల్డ్ కంటెంట్ మీద కూడా జనాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హీరో యష్ అంత ఏముండవని, నేను ఎవరినీ ముద్దు కూడా పెట్టుకోలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ కియారా అద్వానీ, తారా సుతారియా పాటల్లో చూస్తేనేమో ఫుల్లుగా రొమాన్స్ ఉంది. ఇక్కడ లింక్ మిస్ అవుతోంది. ఏది ఏమైనా టికెట్ రేట్ల హైక్ తీసుకున్నా తీసుకోకపోయినా టాక్సిక్ మటుకు యునానిమస్ టాక్ తెచ్చుకుంటేనే మనదగ్గర వర్కౌట్ చేసుకోగలదు.
This post was last modified on August 19, 2026 4:45 pm
అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…
ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…
సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు…
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి…
పరకాల నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ భావించిన సంగతి తెలిసిందే. అయితే,…