కరోనా వేళ.. ఎవరికి వారు వారికి తోచినంత మొత్తాన్ని విరాళాల రూపంలో అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఇలా వచ్చిన మొత్తాల్ని దేని కోసం వినియోగిస్తున్నారు? దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న క్వశ్చన్లు రావటం ఖాయం. సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున వస్తున్న నిధుల్ని దేని కోసం వినియోగించాలి? ఏమేం కొనాలన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.
కరోనా వ్యాప్తిని నిరోధించే విషయంలోనూ వైద్యులు.. వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున సేవ చేస్తున్నారు. వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ సీఎం ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించారు. విరాళాల రూపంలో వచ్చే మొత్తాల్ని.. వైద్యులకు.. వైద్య సిబ్బందికి అవసరమయ్యే మాస్కులు.. పీపీఈలు.. మందుల కొనుగోలు కోసం ఉపయోగించాలని కోరారు.
తెలంగాణలోని కరోనా వార్డుల్లో పని చేస్తున్న వారికి సరైన సదుపాయాలు లేవన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా తీసుకోవటం లేదని.. బాడీసూట్లకు బదులుగా.. యాప్రాన్లు.. మాస్కులు పెట్టుకొని పని చేస్తున్నారని.. ఇదంతా చాలా ప్రమాదకరంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఈ కారణంతోనే విరాళాల రూపంలో వచ్చే మొత్తాలతో వైద్యులు.. వైద్య సిబ్బందికి అవసరమైన సామాగ్రి కొనుగోలు కోసం వినియోగించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు కేసీఆర్. మొత్తానికి మీడియా సమావేశంలో ప్రశ్నించే మీడియాప్రతినిధులపై ఎదురుదాడి చేసే సీఎం కేసీఆర్.. పత్రికల్లో వచ్చే వార్తల విషయంలో మాత్రం సీరియస్ గా ఉంటున్న వైనం తాజా నిర్ణయాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.
This post was last modified on April 9, 2020 6:47 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…