కరోనా వేళ.. ఎవరికి వారు వారికి తోచినంత మొత్తాన్ని విరాళాల రూపంలో అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఇలా వచ్చిన మొత్తాల్ని దేని కోసం వినియోగిస్తున్నారు? దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న క్వశ్చన్లు రావటం ఖాయం. సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున వస్తున్న నిధుల్ని దేని కోసం వినియోగించాలి? ఏమేం కొనాలన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.
కరోనా వ్యాప్తిని నిరోధించే విషయంలోనూ వైద్యులు.. వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున సేవ చేస్తున్నారు. వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ సీఎం ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించారు. విరాళాల రూపంలో వచ్చే మొత్తాల్ని.. వైద్యులకు.. వైద్య సిబ్బందికి అవసరమయ్యే మాస్కులు.. పీపీఈలు.. మందుల కొనుగోలు కోసం ఉపయోగించాలని కోరారు.
తెలంగాణలోని కరోనా వార్డుల్లో పని చేస్తున్న వారికి సరైన సదుపాయాలు లేవన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా తీసుకోవటం లేదని.. బాడీసూట్లకు బదులుగా.. యాప్రాన్లు.. మాస్కులు పెట్టుకొని పని చేస్తున్నారని.. ఇదంతా చాలా ప్రమాదకరంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఈ కారణంతోనే విరాళాల రూపంలో వచ్చే మొత్తాలతో వైద్యులు.. వైద్య సిబ్బందికి అవసరమైన సామాగ్రి కొనుగోలు కోసం వినియోగించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు కేసీఆర్. మొత్తానికి మీడియా సమావేశంలో ప్రశ్నించే మీడియాప్రతినిధులపై ఎదురుదాడి చేసే సీఎం కేసీఆర్.. పత్రికల్లో వచ్చే వార్తల విషయంలో మాత్రం సీరియస్ గా ఉంటున్న వైనం తాజా నిర్ణయాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.
This post was last modified on April 9, 2020 6:47 pm
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…
నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…
మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…