Categories: Political News

సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చే డబ్బులతో ఏం కొనాలో చెప్పేసిన కేసీఆర్

కరోనా వేళ.. ఎవరికి వారు వారికి తోచినంత మొత్తాన్ని విరాళాల రూపంలో అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఇలా వచ్చిన మొత్తాల్ని దేని కోసం వినియోగిస్తున్నారు? దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న క్వశ్చన్లు రావటం ఖాయం. సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున వస్తున్న నిధుల్ని దేని కోసం వినియోగించాలి? ఏమేం కొనాలన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.
కరోనా వ్యాప్తిని నిరోధించే విషయంలోనూ వైద్యులు.. వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున సేవ చేస్తున్నారు. వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ సీఎం ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించారు. విరాళాల రూపంలో వచ్చే మొత్తాల్ని.. వైద్యులకు.. వైద్య సిబ్బందికి అవసరమయ్యే మాస్కులు.. పీపీఈలు.. మందుల కొనుగోలు కోసం ఉపయోగించాలని కోరారు.
తెలంగాణలోని కరోనా వార్డుల్లో పని చేస్తున్న వారికి సరైన సదుపాయాలు లేవన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా తీసుకోవటం లేదని.. బాడీసూట్లకు బదులుగా.. యాప్రాన్లు.. మాస్కులు పెట్టుకొని పని చేస్తున్నారని.. ఇదంతా చాలా ప్రమాదకరంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది.
 ఈ కారణంతోనే విరాళాల రూపంలో వచ్చే మొత్తాలతో వైద్యులు.. వైద్య సిబ్బందికి అవసరమైన సామాగ్రి కొనుగోలు కోసం వినియోగించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు కేసీఆర్. మొత్తానికి మీడియా సమావేశంలో ప్రశ్నించే మీడియాప్రతినిధులపై ఎదురుదాడి చేసే సీఎం కేసీఆర్.. పత్రికల్లో వచ్చే వార్తల విషయంలో మాత్రం సీరియస్ గా ఉంటున్న వైనం తాజా నిర్ణయాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.

This post was last modified on April 9, 2020 6:47 pm

Share

Recent Posts

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

31 minutes ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

1 hour ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

1 hour ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

1 hour ago

అభిమాని చిరకాల కోరిక తీర్చిన రామ్

సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు…

1 hour ago

అన్నయ్యను పలకరించాలి బ్రహ్మానందం గారూ…

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి…

2 hours ago