Political News

నాయకుడు లేకుండా యుద్ధం ఎలా జగన్?

స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్‌ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్‌ ఇస్తున్న రోడ్‌మ్యాప్‌ ఇదే..! స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన పార్టీ శ్రేణులకు ఇస్తున్న ఈ ఆదేశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

అయితే యుద్ధం చేయాల్సింది క్యాడర్‌ అయితే.. నాయకుడు ఎక్కడ? గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు జగన్‌ ఒక్కసారి కూడా రోడ్డుపైకి వచ్చి ప్రత్యక్ష పోరాటానికి దిగలేదు. పార్టీ క్యాడర్‌ రోడ్లపై ఉంటే.. అధినేత మాత్రం ఏసీ గదులకే పరిమితమయ్యారంటూ కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

ఎన్నికల సమరంలో ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన బాధ్యత కేవలం కార్యకర్తలదేనా? నాయకత్వం కూడా వారికి అండగా నిలవాల్సిన అవసరం లేదా? ఎన్నికలు అంటే కేవలం రోడ్‌మ్యాప్‌లు ఇవ్వడం కాదు.. రోడ్డుపైకి వచ్చి క్యాడర్‌ను నడిపించడం కూడా.

అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు ఏడాది పాటు వైసీపీ అధినేతతో పాటు శ్రేణులు స్తబ్ధుగా ఉండిపోయారు. ఆ తర్వాత అప్పుడప్పుడు పరామర్శల పేరుతో జగన్‌ రోడ్డుపైకి వచ్చారు. ఆ కార్యక్రమాలన్నీ బలప్రదర్శన మాదిరిగా ఉన్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక్క డీఎస్సీ అంశంపైనే ఆరోపణలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఏడాది తర్వాత చేపట్టబోయే పాదయాత్రపైనే ఆయన ఆశ పెట్టుకున్నారు.

ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో జగన్‌ అలెర్ట్‌ అయ్యారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్న జగన్‌.. ఈసారైనా స్వయంగా రంగంలోకి దిగుతారా? కార్యకర్తలతో కలిసి రోడ్డుపైకి వచ్చి రాజకీయ పోరాటానికి నాయకత్వం వహిస్తారా? లేక మరోసారి క్యాడర్‌కే యుద్ధ బాధ్యతలు అప్పగించి తాను దూరంగా ఉంటారా? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

This post was last modified on August 19, 2026 6:14 pm

Share

Recent Posts

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…

31 minutes ago

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

1 hour ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

2 hours ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

2 hours ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

2 hours ago

అభిమాని చిరకాల కోరిక తీర్చిన రామ్

సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు…

2 hours ago