Political News

మోడీకి ఏం చేయాలో చెబుతూ లేఖ రాసిన మన్మోహన్.. ఏముంది?

రాజకీయాల్ని పక్కన పెడితే.. మేధావిగా.. దేశ ఆర్థిక సమస్యలకు చికిత్స చేసే సత్తా ఉన్న ఆర్థికవేత్త కమ్ రాజకీయ నేతగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను చెప్పాలి. సోనియమ్మ చేతిలో రిమోట్ గా మారి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు కానీ.. ఆయన హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉందని చెప్పాలి. వరుసగా చోటు చేసుకున్న కుంభకోణాల్ని అరికట్టటంలో ఆయన ఫెయిల్ అయ్యారే కానీ.. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సమర్థంగా వ్యవహరించటంలో ఆయన్ను నిందించలేం.

పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించినప్పటికి.. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత..ఎంతో అవసరమైతే తప్పించి కలుగజేసుకోకుండా ఉంటూ హుందాగా వ్యవహరిస్తున్నారు. ఎంతో అత్యవసరమైతే తప్పించి.. ఇష్యూలపై స్పందించని ఆయన తత్త్వాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. ఓపక్క వ్యాక్సినేషన్ విషయంలో మోడీ సర్కారు ఫెయిల్ అయ్యిందన్న విమర్శలు.. అంచనాలకు మించిన నమోదవుతున్న పాజిటివ్ కేసులతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

దీంతో పాటు.. ఆక్సిజన్ కొరత..రెమెడెసివర్ లాంటి మందుల కొరతతో తెగ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మన్మోహన్ స్పందించారు. మోడీ సర్కారు తప్పుల్ని.. వైఫల్యాల్ని కళ్లకు కట్టేలా ఆయన లేఖలోని అంశాలు ఉన్నాయి. సెకండ్ వేవ్ తన తఢాఖా చూపిస్తున్న వేళ.. అందుకు తగ్గట్లుగా మోడీ సర్కారు స్పందించటం లేదన్న మాట అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. మన్మోహన్ లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ప్రధాని మోడీకి ఆయన ఒక లేఖలో  మహమ్మారిని ఎదుర్కోనేందుకు కొన్ని సూచనలు చేశారు. అదే సమయంలో.. ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని చెప్పటం ద్వారా.. ఏమేం చేయలేదో చెప్పేశారు. అంతేకాదు.. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి వ్యూహం ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేశారు.

మోడీకి మన్మోహన్ రాసిన లేఖలో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..
–  దేశంలో ఎంతమంది వ్యాక్సిన్లు తీసుకున్నారన్నది ముఖ్యం కాదు. దేశ జనాభాలో ఎంత శాతం మందికి టీకా ఇచ్చామన్నదే ముఖ్యం.
–  ఈ విషయంలో భారత్ చాలా వెనుకబడిపోయింది.  టీకా కార్యక్రమాన్ని మరింత వేగంగా కొనసాగించాలి.
–  వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు కరోనా టీకాల కోసం ప్రభుత్వం పెట్టిన ఆర్డర్ల వివరాల్ని వెల్లడించాలి.
– రానున్న ఆర్నెల్లలో అందే టీకాలు ఎన్ని? అవి ఎక్కడ నుంచి రాబోతున్నాయో తెలియజేయాలి
–  వివిధ కంపెనీల నుంచి అందే టీకాల్ని రాష్ట్రాలకు ఎలా పంచబోతున్నారో వివరించాలి
–  అత్యవసర పరిస్థితుల కోసం కేంద్రం 10 శాతం టీకాల్ని ఉంచుకోవాలి
–  రాష్ట్రాలకు టీకాలు ఎంత పంచబోతున్నారో తెలియజేస్తే.. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది
–  వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు కేంద్రం కొన్ని ప్రోత్సాహాకాలు ఇవ్వాలి. దీంతో.. ఆ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునే వీలుంది.
–  ఐరోపా మెడికల్ ఏజెన్సీ.. యూఎస్ఎఫ్ డీఏ లాంటి ప్రాధికార సంస్థలు ఆమోదించిన టీకాల్ని ఎలాంటి షరతులు లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలి.

This post was last modified on April 19, 2021 6:48 am

Share
Show comments
Published by
satya

Recent Posts

కూటమి మేనిఫెస్టో విడుదల.. తొలి సంతకం ఆ ఫైలుపైనే

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…

46 mins ago

అన్న‌ను కార్న‌ర్ చేసిన ష‌ర్మిల‌.. జ‌గ‌న్ చుట్టూ చిక్కులు!

ఒక్కొక్క‌సారి కొన్నికొన్ని విష‌యాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే మంచిది. అలా ప‌ట్టించుకుంటే.. మ‌న‌కేదో మేలు జ‌రుగుతుంద‌ని అనుకుంటే.. అదే పెద్ద త‌ప్పిదం అయి…

53 mins ago

సెన్సేషనల్ సినిమా కాపీ కొట్టి తీశారా

మార్చిలో పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై మంచి విజయం నమోదు చేసుకున్న బాలీవుడ్ మూవీ 'లాపతా లేడీస్'…

58 mins ago

పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా

ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాత‌త‌రానికి చెందిన నాయ‌కులు.. ఒక కులాన్ని ప్ర‌భావితం చేస్తార‌ని భావించే నాయ‌కులు ముఖ్యంగా…

1 hour ago

దర్శకుల ఉత్సవంలో ఊహించని మెరుపులు

మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…

2 hours ago

వారికి గాజు గ్లాసు గుర్తు ఎలా కేటాయిస్తారు?:  హైకోర్టు సీరియ‌స్‌

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రంలో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌దాన పార్టీ జ‌న‌సేన‌కు కేటాయించిన గాజు గ్లాసు…

3 hours ago