తెలుగు సినిమాల దేశీయ మార్కెట్ కొవిడ్ దెబ్బ నుంచి మధ్యలో బాగానే కోలుకుంది. గత కొన్ని నెలల్లో కొన్ని సినిమాలు ఇరగాడేశాయి. చివరగా వచ్చిన భారీ చిత్రం వకీల్ సాబ్ సైతం తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కానీ యుఎస్లో మాత్రం మిగతా సినిమాల్లాగే తెలుగు చిత్రాల మార్కెట్ పుంజుకోవడంలో ఇబ్బందులు తప్పలేదు.
ఐతే గత నెలలో వచ్చిన జాతిరత్నాలు సినిమా యుఎస్లో అంచనాల్ని మించి ఆడేసింది. ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగు పెట్టి ఔరా అనిపించింది. దీంతో ఇక అక్కడ మార్కెట్ కూడా పూర్వపు స్థితికి చేరుకున్నట్లే అని.. ఇక పెద్ద సినిమాలకు అక్కడ ఢోకా లేనట్లే అని అనుకున్నారు. జాతిరత్నాలు సినిమాకే అలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్కు ఇంకెంతగా యుఎస్ తెలుగు ప్రేక్షకులు నీరాజనం పడతారో అనుకున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే వకీల్ సాబ్ ఈజీగా 1.5-2 మిలియన్ డాలర్ల మధ్య వసూళ్లు రాబడుతుందని అంచనా వేశారు. తీరా చూస్తే అక్కడ ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేసింది. తొలి వీకెండ్లో 6 లక్షల డాలర్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత పెద్దగా ముందుకు కదల్లేదు. ఫుల్ రన్ వసూళ్లు 7.5 లక్షల డాలర్లను దాటేలా లేవు. అక్కడా ఆల్మోస్ట్ సినిమా రన్ అయిపోయినట్లే. జాతిరత్నాలుతో మార్కెట్ పుంజుకుందని భావించి వకీల్ సాబ్ సహా పెద్ద సినిమాలకు మంచి రేట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు బయ్యర్లు. కొన్ని సినిమాలకు డీల్స్ కూడా అయ్యాయి.
కానీ వకీల్ సాబ్ బ్రేక్ ఈవెన్కు దాదాపు హాఫ్ మిలియన్ దగ్గర ఆగిపోయి బయ్యర్లను నష్టాల పాలు చేయడంతో తర్వాతి సినిమాల విషయంలో భయం మొదలైంది. అందులోనూ మళ్లీ కరోనా భయం పెరుగుతుండటంతో యుఎస్ మార్కెట్ పూర్వపు స్థాయిని అందుకోవడం కాదు కదా.. మళ్లీ తిరోగమన బాట పడుతుందనే భయం బయ్యర్లలో పుడుతోంది.
This post was last modified on April 19, 2021 6:46 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…