తెలుగు సినిమాల దేశీయ మార్కెట్ కొవిడ్ దెబ్బ నుంచి మధ్యలో బాగానే కోలుకుంది. గత కొన్ని నెలల్లో కొన్ని సినిమాలు ఇరగాడేశాయి. చివరగా వచ్చిన భారీ చిత్రం వకీల్ సాబ్ సైతం తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కానీ యుఎస్లో మాత్రం మిగతా సినిమాల్లాగే తెలుగు చిత్రాల మార్కెట్ పుంజుకోవడంలో ఇబ్బందులు తప్పలేదు.
ఐతే గత నెలలో వచ్చిన జాతిరత్నాలు సినిమా యుఎస్లో అంచనాల్ని మించి ఆడేసింది. ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగు పెట్టి ఔరా అనిపించింది. దీంతో ఇక అక్కడ మార్కెట్ కూడా పూర్వపు స్థితికి చేరుకున్నట్లే అని.. ఇక పెద్ద సినిమాలకు అక్కడ ఢోకా లేనట్లే అని అనుకున్నారు. జాతిరత్నాలు సినిమాకే అలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్కు ఇంకెంతగా యుఎస్ తెలుగు ప్రేక్షకులు నీరాజనం పడతారో అనుకున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే వకీల్ సాబ్ ఈజీగా 1.5-2 మిలియన్ డాలర్ల మధ్య వసూళ్లు రాబడుతుందని అంచనా వేశారు. తీరా చూస్తే అక్కడ ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేసింది. తొలి వీకెండ్లో 6 లక్షల డాలర్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత పెద్దగా ముందుకు కదల్లేదు. ఫుల్ రన్ వసూళ్లు 7.5 లక్షల డాలర్లను దాటేలా లేవు. అక్కడా ఆల్మోస్ట్ సినిమా రన్ అయిపోయినట్లే. జాతిరత్నాలుతో మార్కెట్ పుంజుకుందని భావించి వకీల్ సాబ్ సహా పెద్ద సినిమాలకు మంచి రేట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు బయ్యర్లు. కొన్ని సినిమాలకు డీల్స్ కూడా అయ్యాయి.
కానీ వకీల్ సాబ్ బ్రేక్ ఈవెన్కు దాదాపు హాఫ్ మిలియన్ దగ్గర ఆగిపోయి బయ్యర్లను నష్టాల పాలు చేయడంతో తర్వాతి సినిమాల విషయంలో భయం మొదలైంది. అందులోనూ మళ్లీ కరోనా భయం పెరుగుతుండటంతో యుఎస్ మార్కెట్ పూర్వపు స్థాయిని అందుకోవడం కాదు కదా.. మళ్లీ తిరోగమన బాట పడుతుందనే భయం బయ్యర్లలో పుడుతోంది.
This post was last modified on April 19, 2021 6:46 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…