తెలుగు సినిమాల దేశీయ మార్కెట్ కొవిడ్ దెబ్బ నుంచి మధ్యలో బాగానే కోలుకుంది. గత కొన్ని నెలల్లో కొన్ని సినిమాలు ఇరగాడేశాయి. చివరగా వచ్చిన భారీ చిత్రం వకీల్ సాబ్ సైతం తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కానీ యుఎస్లో మాత్రం మిగతా సినిమాల్లాగే తెలుగు చిత్రాల మార్కెట్ పుంజుకోవడంలో ఇబ్బందులు తప్పలేదు.
ఐతే గత నెలలో వచ్చిన జాతిరత్నాలు సినిమా యుఎస్లో అంచనాల్ని మించి ఆడేసింది. ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగు పెట్టి ఔరా అనిపించింది. దీంతో ఇక అక్కడ మార్కెట్ కూడా పూర్వపు స్థితికి చేరుకున్నట్లే అని.. ఇక పెద్ద సినిమాలకు అక్కడ ఢోకా లేనట్లే అని అనుకున్నారు. జాతిరత్నాలు సినిమాకే అలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్కు ఇంకెంతగా యుఎస్ తెలుగు ప్రేక్షకులు నీరాజనం పడతారో అనుకున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే వకీల్ సాబ్ ఈజీగా 1.5-2 మిలియన్ డాలర్ల మధ్య వసూళ్లు రాబడుతుందని అంచనా వేశారు. తీరా చూస్తే అక్కడ ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేసింది. తొలి వీకెండ్లో 6 లక్షల డాలర్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత పెద్దగా ముందుకు కదల్లేదు. ఫుల్ రన్ వసూళ్లు 7.5 లక్షల డాలర్లను దాటేలా లేవు. అక్కడా ఆల్మోస్ట్ సినిమా రన్ అయిపోయినట్లే. జాతిరత్నాలుతో మార్కెట్ పుంజుకుందని భావించి వకీల్ సాబ్ సహా పెద్ద సినిమాలకు మంచి రేట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు బయ్యర్లు. కొన్ని సినిమాలకు డీల్స్ కూడా అయ్యాయి.
కానీ వకీల్ సాబ్ బ్రేక్ ఈవెన్కు దాదాపు హాఫ్ మిలియన్ దగ్గర ఆగిపోయి బయ్యర్లను నష్టాల పాలు చేయడంతో తర్వాతి సినిమాల విషయంలో భయం మొదలైంది. అందులోనూ మళ్లీ కరోనా భయం పెరుగుతుండటంతో యుఎస్ మార్కెట్ పూర్వపు స్థాయిని అందుకోవడం కాదు కదా.. మళ్లీ తిరోగమన బాట పడుతుందనే భయం బయ్యర్లలో పుడుతోంది.
This post was last modified on April 19, 2021 6:46 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…