Movie News

ఇంతకీ బన్నీ మనసులో ఏముంది?

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏది? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. కొన్ని రోజుల ముందు వరకు అయితే కొరటాల శివతో సినిమానే చేస్తాడని అనుకున్నారంతా. కానీ ‘ఆచార్య’ తర్వాత కొరటాల అనూహ్యంగా ఎన్టీఆర్ సినిమాను లైన్లో పెట్టాడు. దీంతో బన్నీ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయింది. ఇంకో రెండు మూడు నెలల్లో ‘పుష్ప’ పూర్తి చేసి ఖాళీ అవబోతున్న బన్నీ.. తర్వాత ఏ సినిమా చేస్తాడనే అయోమయం అందరిలోనూ కొనసాగుతోంది.

అతను కలిసి పని చేయాలనుకుంటున్న ఏ స్టార్ ధర్శకుడూ ఆ సమయానికి ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అతను ఎప్పట్నుంచో పెండింగ్‌లో పెట్టిన ‘ఐకాన్’ ఏమైనా పట్టాలెక్కుతుందా అని చూస్తున్నారు అభిమానులు. ఈ చిత్రానికి స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయిపోయింది. దర్శకుడు, నిర్మాత సిద్ధంగా ఉన్నారు. కానీ బన్నీనే ఎటూ తేల్చట్లేదు.

బన్నీకి ‘ఐకాన్’ నచ్చిన కథ అని.. ఏదో ఒక టైంలో వీలు చేసుకుని ఈ సినిమా చేస్తానని దర్శకుడు వేణు శ్రీరామ్‌కు బన్నీ చెప్పాడని గతంలో అతడి మిత్రుడు బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక తాజాగా ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో వేణును అడిగితే ఆ సినిమా ఎఫ్పుడు మొదలవుతుందో తనకు తెలియదనేశాడు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో దిల్ రాజు ఏమో.. తమ తర్వాతి సినిమా ‘ఐకాన్’యే అంటూ ప్రకటించాడు. కానీ బన్నీ మాత్రం ఈ సినిమాను వెంటనే మొదలుపెట్టే మూడ్‌లో లేడన్నది అతడి సన్నిహితుల మాట.

ఒక టైంలో ఈ చిత్రం చేయడానికి మాట ఇచ్చినప్పటికీ.. ఆ సినిమా చేయడం కరెక్టా కాదా అనే సందిగ్ధంలో అతను పడ్డాడని.. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అసాధారణ విజయం అందుకున్నాక అతడి ఆలోచన తీరు మారిపోయిందని, ఆషామాషీ సినిమాలు చేయొద్దని, బాగా పేరున్న దర్శకులతోనే పని చేయాలనే ధోరణిలోకి వెళ్లిపోయాడని.. అందుకే ‘ఐకాన్’ సంగతి ఎటూ తేల్చట్లేదని అంటున్నారు. ‘పుష్ప’ తర్వాత తాను కోరుకున్న స్థాయిలో ఏ ప్రాజెక్టు సెట్ కాకపోతే అప్పుడు ‘ఐకాన్’ గురించి ఆలోచిస్తాడని.. తుది నిర్ణయం మాత్రం ఇప్పుడే తీసుకోడని అతడి సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

This post was last modified on April 19, 2021 6:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

36 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago