అస‌లైన యుద్ధం మొద‌లయ్యేది ఇపుడే

ఇపుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల యుద్ధం ఒక ప‌ద్ద‌తి. తొంద‌ర‌లో మొద‌ల‌వ్వ‌బోయే యుద్ధం మ‌రో ప‌ద్ద‌తి. ఇపుడే అస‌లైన ఎన్నిక‌ల యుద్ధం మొద‌ల‌వ్వ‌బోతోంది. పుర‌పాల‌క సంఘాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ వచ్చేసింది. దాదాపు 15 రోజుల క్రితం మొద‌లైన పంచాయితీ ఎన్నిక‌ల్లో పార్టీల గుర్తులు ఉండ‌వ‌న్న విష‌యం తెలిసిందే.

ఎప్పుడైతు గుర్తులు లేవో గెలిచిన వారంతా త‌మ వారే అని అధికార వైసీపీ, కాదు కాదు త‌మకు 38 శాతం పంచాయితీలు వ‌చ్చాయ‌ని ప్ర‌ధాన ప్ర‌తినప‌క్షం తెలుగుదేశంపార్టీ వాదులాడుకుంటున్న విష‌యాన్ని చూస్తున్న‌దే. స‌రే ఈ విష‌య‌న్ని ప‌క్క‌న పెట్టేస్తే తొంద‌ర‌లోనే మొద‌ల‌వ్వ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల మీదే జ‌రుగుతుంది. దాంతో ఏ పార్టీ ఎన్ని ఛైర్మ‌న్ స్ధానాల‌ను గెలుచుకున్న‌ది, వార్డుల‌ను గెలుచుకున్న‌ద‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తుంది.

ఇప్ప‌టిలా రెండుపార్టీలు ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్ళు క్లైం చేసుకునేందుకు ఉండ‌దు. పంచాయితి ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ మ‌ద్ద‌తుదారులు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌టానికి చాలా చోట్ల ఎవ‌రు ముందుకు రాలేదని వైసీపీ అంటోంది. కానీ ఇక్క‌డే గెలిచిన పంచాయితీల మ‌ద్ద‌తుదారుల విష‌యంలో చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెబుతున్నాడ‌ని వాళ్ళు గెలిచింది కేవ‌లం 15 శాతం పంచాయితీల్లోనే అని వైసీపీ నేత‌లంటున్నారు. గెలిచిన త‌మ మ‌ద్ద‌తుదారుల వివ‌రాల‌ను ఫొటోల‌తో స‌హా తాము చూపించగలం అని చంద్ర‌బాబు అంటున్నారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇలాంటి గంద‌ర‌గోళానికి అవ‌కాశం లేదు. వార్డు కౌన్సిల‌ర్ ద‌గ్గ‌ర నుండి ఛైర్మ‌న్ గా పోటీ చేసే వాళ్ళంద‌రు పార్టీల గుర్తుల మీదే పోటీ చేయాలి. కాబ‌ట్టి పార్టీల కెపాసిటి ఏమిటో తేలిపోతుంది. స‌హ‌జంగానే లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్సంటే అధికార‌పార్టీకే అనుకూలంగా ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. కాబ‌ట్టి రేప‌టి ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ త‌న ఆధిక్య‌త‌ను నిరూపించుకుంటుందా? తెలుగుదేశం పై చేయి సాధిస్తుందా? అన్నది తేలనుంది.