అధికారంలోకి వచ్చిన సుమారు రెండేళ్ళకు జగన్మోహన్ రెడ్డికి అసలైన పరీక్ష ఎదురైంది. అదే విశాఖపట్నం స్టీల్ పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయటం. విశాఖ స్టీల్స్ ను ప్రైవేటు చేతుల్లో పెట్టేయాలని కేంద్రం ఇప్పటికే డిసైడ్ చేసేసింది. నిజానికి ఈ ఫ్యాక్టరీని బలోపేతం చేయటంపై కేంద్రం గనుక శ్రద్ధచూపిస్తే మంచి లాభాల్లో నడిచే అవకాశాలు పుష్కలంగా ఉంది. దాదాపు 90 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధిని చూపిస్తున్న విశాక స్టీల్స్ నష్టాల్లో ఉందంటే అందుకు కేంద్రప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
సరే ఈ టెక్నికాలిటీస్ లోకి వెళ్ళటం ఇపుడు అనవసరం. ఎందుకంటే ఫ్యాక్టరీ నష్టాలకు ఎవరు కారణం అని ఇపుడు పోస్టుమార్టం చేయటం కన్నా దీన్ని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవటం ఎలాగన్నదే ముఖ్యం. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారమే విశాఖలో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన మొదలైపోయింది. వీరికి మద్దతుగా రాజకీయపార్టీలు కూడా జతకలిశాయి.
వైసీపీ ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి మాట్లాడుతూ విశాఖస్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకుంటామన్నారు. అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేయటానికి కూడా రెడీ అంటున్నారు. అలాగే వైసీపీ ఎంఎల్ఏ నాగిరెడ్డి, టీడీపీ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణబాబు కూడా రాజీనామాలకు వెనక్కు తగ్గేది లేదంటున్నారు. కాబట్టి మొదలైన ఆందోళన చివరకు ఉద్యమరూపు సంతరించుకుంటే కానీ కేంద్రానికి సెగతగలదు.
ఆందోళన కాస్త ఉద్యమరూపు తీసుకోవాలంటే అందుకు ముందు అధికారపార్టీ ప్రజాప్రతినిధులపైనే ఎక్కువ బాధ్యతుంది. ఆందోళన తీవ్రరూపం దాల్చకుండానే జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమవ్వాలి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకుండా జగన్ అడ్డుకోవాలి. వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోడితో మాట్లాడాలి కార్యచరణను రెడీ చేయాలి. లేకపోతే విశాఖస్టీల్స్ లోని కేంద్రంవాటా మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనేసి ఫ్యాక్టరీని పూర్తిగా రాష్ట్రప్రభుత్వ సంస్ధగా మార్చేయాలి. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని డిసైడ్ అయిన జగన్ కు విశాఖస్టీల్స్ ను కాపాడుకోవటం చాలా ముఖ్యం. మరి ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on February 6, 2021 12:43 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…