అదిగో సినిమా అంటే… ఇదిగో రిలీజ్ డేట్ అన్నట్టు తయారైంది టాలీవుడ్ యవ్వారం. అందుకే రిలీజ్ డేట్ల జాతర కొనసాగుతోంది. అంతెందుకు… సినిమా మొదలెట్టకుండానే, అక్టోబరు 1న సినిమా విడుదల చేస్తున్నాం, అంటూ షాకిచ్చాడు మారుతి.
ఇలా.. అంతా రిలీజ్ డేట్లు ప్రకటించుకోవడంలో బిజీ అయిపోయారు. క్రిష్ మాత్రం నోరు మెదపడం లేదు. అటు పవన్ సినిమా రిలీజ్డేట్ రాలేదు, ఇటు వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పలేదు.
పవన్ సినిమా 2022లోనే అని టాక్. వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ లతో క్రిష్ ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా దాదాపు అయిపోయింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంకా రాలేదు. దానికి ఓ బలమైన కారణం ఉంది. ఈసినిమాకి గ్రాఫిక్స్ తో చాలా పని ఉంది. అందుకోసం దాదాపు 4 నెలలు సమయం కేటాయించాలట. గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆ పనులు ఓ పట్టాన తెవలవు. 4 నెలలు అనుకున్నది కాస్త 6 నెలలు అవ్వొచ్చు. అది గ్రాఫిక్స్ కంపెనీ నైపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. గ్రాఫిక్స్ నచ్చకపోతే.. తిరిగి మళ్లీ చేయించుకోవాలి.
అందుకే…విజువల్ ఎఫెక్ట్స్ పనులు అయ్యేంత వరకూ… ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్పకూడదని క్రిష్ ఫిక్సయ్యాడని టాక్. కొండపొలెం అనే ప్రసిద్ధమైన నవల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతోంది. అటవీ నేపథ్యమైన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ గ్రాఫిక్స్ లోనే తీయాలి. అన్నట్టు ఈ సినిమాకి జంగిల్ బుక్ అనే పేరు పరిశీలిస్తున్నారు.
This post was last modified on February 6, 2021 12:30 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…