నితిన్కి ఓవర్సీస్ మార్కెట్ కాస్త బాగానే ఉంటుంది. ఎందుకంటే… తనది ఫన్, రొమాంటిక్ జోనర్. ఇలాంటి కథలు.. ఓవర్సీస్ ప్రేక్షకులకు ఈజీగా నచ్చేస్తాయి. అఆ, భీష్మ లాంటి సినిమాలతో అక్కడి మార్కెట్ ని మరింత పెంచుకున్నాడు నితిన్. రంగ్ దేమీద కూడా బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాని ఓవర్సీస్లో మంచి రేటుకి అమ్మాలని చూస్తున్నారు నిర్మాతలు.
అయితే.. ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు డీలాగా ఉంది. అమెరికా వసూళ్లపై ఆశలు పెట్టుకునే అవకాశమే లేదు. టోటల్ గా ఓవర్సీస్ మార్కెట్ ఢమాల్. కాకపోతే.. రంగ్ దే ఓవర్సీస్ రూపంలో కనీసం 2 కోట్లు రాబట్టాలన్నది నిర్మాతల ప్రయత్నం. కానీ.. అంత పలకడం లేదు. కోటి, కోటిన్నర అంటూ బేరాలు తీస్తున్నారు బయ్యర్లు.
ఇంకాస్త రేటు పలికితే.. ఈ డీల్ క్లోజ్ చేయాలని.. నిర్మాతలు భావిస్తున్నారు. మార్చి 26న రంగ్ దే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on February 6, 2021 1:31 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…