Political News

రాఖీ రాజీ చేసేనా? సీఎం ఇంటికి కొండా సురేఖ!

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ముందుకొచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎంకు రాఖీ కట్టేందుకు అపాయింట్‌మెంట్‌ కోరిన సురేఖ.. తాజాగా ఆయన నివాసానికి చేరుకున్నారు.

అంతకుముందు సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సురేఖ.. సీఎంకు రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి–మంత్రి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇటీవల ఇద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రాఖీ పండుగను కుటుంబ అనుబంధానికి ప్రతీకగా భావించే నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు సురేఖ తీసుకున్న నిర్ణయం రాజకీయంగానూ చర్చకు దారితీసింది.

సీఎం నివాసానికి సురేఖ చేరుకోవడంతో.. భేటీలో ఏం చర్చిస్తారన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

This post was last modified on August 28, 2026 10:54 am

Share

Recent Posts

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

1 hour ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

3 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

3 hours ago

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

3 hours ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

4 hours ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

5 hours ago