సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్ టైంలో ఫ్లాప్ గా నిలిచిన పంజాని రీ రిలీజ్ లో సూపర్ హిట్ చేసేందుకు పూనుకున్నారు. ప్రకృతి చికిత్స కోసం కేరళ వెళ్లిన పవన్ ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా ఫ్యాన్స్, జనసేన వర్గాలు పెద్ద ఎత్తున సంబరాలకు రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు అందరి చూపు ఓజి 2 అప్డేట్ మీద ఉంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు.
మొన్నామధ్య ఒక ఈవెంట్ లో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓజి 2 అప్డేట్ వస్తుందని తమన్ చాలా నమ్మకంగా చెప్పారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఒక పోస్టర్ లేదా చిన్న యానిమేషన్ గ్లింప్స్ రిలీజ్ చేయడం మినహా అంతకన్నా ఎక్కువ కంటెంట్ రాకపోవచ్చని అంటున్నారు. సీక్వెల్ చేయడం పట్ల పవన్ చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ ఆరోగ్యం దృష్ట్యా ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనే క్లారిటీ ఎవరి దగ్గరా లేదు. దర్శకుడు సుజిత్ అటు నానితో బ్లడీ రోమియో పూర్తి చేసుకుని వచ్చాక ఓజి 2ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
సో ఎలా చూసుకున్నా ఇంకా చాలా టైం ఉంది. పవన్ ఇప్పుడప్పుడే ఎక్కువ సినిమాలు చేసేయాలని తాపత్రయంలో లేరు. అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డితో అనుకున్న ప్రాజెక్టు కూడా హోల్డ్ లో పెట్టారు. ఓజి 2 మాత్రమే సాలిడ్ గా ముందుకు వెళ్తుంది. ఒకవేళ బర్త్ డేకి ఏదైనా ఫస్ట్ లుక్ లాంటిది వదిలినా ఆ తర్వాత దాన్ని వెంటనే మర్చిపోవడం ఉత్తమం. ఎందుకంటే ఓజి 2 సెట్స్ పైకి వెళ్లి షూట్ జరుపుకుని రిలీజ్ వచ్చే నాటికి 2027 అయిపోవచ్చు.
ఇక దర్శకుడు సుజిత్ విషయానికి వస్తే ఓజి 2 స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉందట. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం వెంటనే మొదలు పెట్టేస్తారు. అయితే బ్లడీ రోమియోని వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. తమన్ సంగీతం సమకూర్చబోతున్న ఓజి 2లో ప్రియాంక మోహన్ తప్ప మిగిలిన క్యాస్టింగ్ అలాగే కొనసాగుతారు. కథ డిమాండ్ చేసినా సరే ప్రకాష్ రాజ్ వద్దని ఫ్యాన్స్ కోరుతున్న తరుణంలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.
This post was last modified on August 28, 2026 11:07 am
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె…
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…