అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద వదిలి దంపతులు నదిలో దూకినట్లు పోలీసులు తెలిపారు. చీకట్లో వణుకుతూ ‘అమ్మా.. నాన్నా’ అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం స్థానికులను కలచివేసింది.
తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు. డ్రైవర్గా పనిచేసే సాయి అప్పుల పాలై వాటిని తీర్చలేక కొంతకాలం క్రితం భీమవరం వచ్చారు. వీరికి మూడేళ్ల క్రితం కవల పిల్లలు జన్మించారు. అప్పుల బాధలు ఇక్కడా వెంటాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
గురువారం రాత్రి తమ పాపను వెంట తీసుకుని స్కూటీపై ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఉన్న దిండి–చించినాడ వశిష్ఠ వంతెన వద్దకు వచ్చినట్లు సమాచారం. రాత్రి 10 గంటల ప్రాంతంలో స్కూటీని వంతెనపై నిలిపి, మూడేళ్ల పాపను అక్కడే వదిలి దంపతులు గోదావరి నదిలో దూకినట్లు స్థానికులు తెలిపారు.
చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న యలమంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వంతెనపై ఉన్న స్కూటీ, చిన్నారిని గుర్తించారు. నదిలో దూకిన దంపతుల కోసం స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.
అమ్మానాన్నల కోసం చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. అప్పుల సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాల్సింది పోయి, తమపై ఆధారపడిన పసివాడిని అనాథగా వదిలి దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on August 28, 2026 9:44 am
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…