Trends

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద వదిలి దంపతులు నదిలో దూకినట్లు పోలీసులు తెలిపారు. చీకట్లో వణుకుతూ ‘అమ్మా.. నాన్నా’ అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం స్థానికులను కలచివేసింది.

తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు. డ్రైవర్‌గా పనిచేసే సాయి అప్పుల పాలై వాటిని తీర్చలేక కొంతకాలం క్రితం భీమవరం వచ్చారు. వీరికి మూడేళ్ల క్రితం కవల పిల్లలు జన్మించారు. అప్పుల బాధలు ఇక్కడా వెంటాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

గురువారం రాత్రి తమ పాపను వెంట తీసుకుని స్కూటీపై ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఉన్న దిండి–చించినాడ వశిష్ఠ వంతెన వద్దకు వచ్చినట్లు సమాచారం. రాత్రి 10 గంటల ప్రాంతంలో స్కూటీని వంతెనపై నిలిపి, మూడేళ్ల పాపను అక్కడే వదిలి దంపతులు గోదావరి నదిలో దూకినట్లు స్థానికులు తెలిపారు.

చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న యలమంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వంతెనపై ఉన్న స్కూటీ, చిన్నారిని గుర్తించారు. నదిలో దూకిన దంపతుల కోసం స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.

అమ్మానాన్నల కోసం చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. అప్పుల సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాల్సింది పోయి, తమపై ఆధారపడిన పసివాడిని అనాథగా వదిలి దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

This post was last modified on August 28, 2026 9:44 am

Share

Recent Posts

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

6 minutes ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

23 minutes ago

రాఖీ రాజీ చేసేనా? సీఎం ఇంటికి కొండా సురేఖ!

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె…

36 minutes ago

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

3 hours ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

5 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

10 hours ago