అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతి రూపం రాఖీ. అలాంటి పవిత్రమైన రాఖీ పండుగ కూడా నేడు రాజకీయ చట్రంలో చిక్కుకుంది. మూడేళ్లుగా తన సోదరుడికి రాఖీ కట్టలేక పోయానంటూ తెలంగాణా రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతున్న సమయంలో ఈసారైనా కేటీఆర్ కు రాఖీ కడతారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దానికి తీవ్రంగా స్పందించిన కవిత గత ఏడాది రాఖీ పండుగ సమయంలో ఆయన నగరంలో లేకుండా ముఖం చాటేశారు, ఈ ఏడాది అడగక ముందే ఏకంగా విదేశాలకు వెళ్లి పోయాడని కామెంట్ చేశారు. పండుగ రోజు అందుబాటులో లేకుండా పోయిన అన్న కేటీఆర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాఖీ అంటే రక్తబంధం, రాజకీయం కాదని స్పష్టం చేశారు. ఆయన ప్రవర్తించిన తీరుతో హర్ట్ అయ్యానంటూ ఫీలయ్యారు. ఒక ఆడబిడ్డగా నాకు ఆత్మ గౌరవం ఉంటుందని చెప్పారు. కవిత కామెంట్స్ తెలంగాణా పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీశాయి. రాజకీయాలు, కుటుంబ బంధాల మధ్య విభజన రేఖ మాయమైపోయిందని, అన్నీ విషయాలు కలగాపులగమై బంధాలు దూరం అవుతున్నాయని సామాజిక వేత్తలు విశ్లేషణ చేస్తున్నారు.
ఇదిలావుండగా కేటీఆర్ కూతురు కల్వకుంట్ల అలేఖ్య కు అమెరికాలోని ప్రతిష్టాత్మక వర్జీనియా టెక్ యూనివర్శిటీలో ఉన్నత విద్యనభ్యసించేందుకు సీటు వచ్చింది. అడ్మిషన్ కోసం కేటీఆర్ కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ ఆయన 15 రోజులు వుంటారు. కనుక రాఖీ పండుగకు ఆయన హైదరాబాద్ లో అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఇందులో నిజానిజాలు దేముడికే తెలియాలని టీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on August 27, 2026 10:11 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…