Political News

బొత్స వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం

మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది ఉన్నారు. తాతల, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహిళా నేతల జాబితా పెద్దదే. తాజాగా ఆ జాబితాలోకి ఏపీలోని సీనియర్ పొలిటిషియన్లలో ఒకరైన మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూతురు బొత్స అనూష చేరారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ స్వయంగా ప్రకటించారు.

బొత్స అనూష ఈ మధ్య వైసీపీ చేపట్టే ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో, అనూష పొలిటికల్‌ ఎంట్రీపై ఉత్తరాంధ్రలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, అఫీషియల్ గా మాత్రం ఈ రోజు ఆ ప్రచారం నిజమేనని బొత్స ప్రకటించారు.

శాసన మండలి సమావేశాల్లో వాడీవేడి చర్చకు కేంద్ర బిందువైన బొత్స ఈ రోజు మీడియాతో జరిగిన చిట్‌చాట్‌ సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. అనూషను తన రాజకీయ వారసురాలిగా బొత్స ప్రకటించారు. అంతేకాదు, త్వరలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయనగరం జడ్పీ చైర్మన్ స్థానానికి ఆమె పోటీ చేయబోతున్నారని కూడా ప్రకటించారు.

బొత్స అనూష ఉన్నత విద్యనభ్యసించారు. ఎంబీబీఎస్/ఎండీ చేసిన అనూష వైద్య వృత్తిలో ఉన్నారు. నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆల్రెడీ బొత్స ఫ్యామిలీ నుంచి పలువురు క్రియాశీలకంగా ఉన్నారు. బొత్స కుటుంబం నుంచి మరో తరం పొలిటిషియన్ గా అరంగేట్రం చేయబోతున్న అనూష తన ప్రస్థానంలో తండ్రిని మించిన తనయురాలిగా గుర్తింపు తెచ్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.

This post was last modified on August 19, 2026 6:33 pm

Share

Recent Posts

నాయకుడు లేకుండా యుద్ధం ఎలా జగన్?

స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్‌ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్‌ ఇస్తున్న…

29 minutes ago

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…

57 minutes ago

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

2 hours ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

2 hours ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

2 hours ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

2 hours ago