Political News

రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి: కొండా సుష్మిత

పరకాల నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ భావించిన సంగతి తెలిసిందే. అయితే, పరకాల నుంచి రాబోయే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని, ఆయనను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా అని సుష్మిత ప్రశ్నించిన వైనం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది.

గత ఎన్నికల్లో పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం కొండా మురళీ ప్రచారం చేసి గెలిపించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు కొండా మురళీ సహకరించారని, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే సమయంలో కొండా మురళీ సహకారం ఉందని అన్నారు.

ఆ క్రమంలోనే కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ, రేవంత్ రెడ్డికి ఈ రోజు కొండా మురళీ గుర్తుకు రావడం లేదని విమర్శించారు. బహుశా ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్లు నెత్తికెక్కాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పరకాల మైసమ్మ తల్లిపై ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు.

తన తండ్రి కొండా మురళీ కింగ్ మేకర్ అని, తనకు భయం లేదని అన్నారు. తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ఈ రోజు చనిపోతే రేపటికి రెండు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక, 80 ఏళ్ల వయసున్న రేవూరికి రెండేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే ప్రకటించారని విమర్శించారు. ఒకవేళ, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని సుష్మితా పటేల్ సంచలన ప్రకటన చేశారు. రేవూరికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని విమర్శించారు.

This post was last modified on August 19, 2026 3:45 pm

Share

Recent Posts

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

7 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

8 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

3 hours ago