వంశీని జగన్ దూరం పెడుతున్నారా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ దూరం పెడుతున్నారా? తన పార్టీలోని మిగతా నేతలతో ఉన్నంత సఖ్యతతో వంశీతో జగన్ ఉండడం లేదా? ఒక మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ కూడా జగన్ ను ఒక సాధారణ కార్యకర్తలాగా బారికేడ్ల అవతల నుంచి కలుస్తున్న వైనం చూస్తుంటే వంశీకి, జగన్ కు మధ్య గ్యాప్ వచ్చినట్లు వస్తున్న పుకార్లు నిజం అనిపించక మానదు.

ఇటీవల గన్నవరం విమానాశ్రయం దగ్గర జగన్ ను కలిసేందుకు వల్లభనేని వంశీ వెళ్లారు. అయితే, జనం మధ్యలో బారికేడ్లకు అవతల వంశీ నిలబడి జగన్ ను పలకరించారు. వాస్తవానికి వంశీనే నేనిక్కడున్నాను అంటూ జగన్ కు అభివాదం చేసిన తర్వాత జగన్ ఆయన దగ్గరకు వెళ్లారు. వంశీ షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా…జగన్ మాత్రం అయిష్టంగా రెండు ముక్కలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరే ఏదో తొందరలో జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి వెళ్లారు అనుకోవడానికి లేదు.

ఇప్పుడే కాదు..కొద్ది రోజులగా వంశీతో వన్ టు వన్ మీటింగ్ లోగానీ, ఇతర సందర్భాల్లోగానీ వంశీ కనబడలేదు. మిగతా నేతలను కలుస్తున్న జగన్…వంశీని మాత్రం కావాలనే దూరం పెడుతున్నట్లు కనిపిస్తోంది. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత వంశీ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? అందుకే వంశీని జగన్ దూరం పెడుతున్నారా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ గ్యాప్ నిజమా..లేేక కల్పిత ప్రచారమా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.