ఉప్పు నిప్పులా ఒకరి మీద మరొకరు ఎప్పుడూ చిటపటలాడే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధినాయకులు నవ్వుతూ పలకరించు కోవడం, కుశల సమాచారాలు మాట్లాడుకోవడం రెండు రోజుల క్రితం ఒక శుభాకార్యంలో కనిపించింది. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం చూసి విసుగెత్తిన వారికి ఇది ఉత్సాహం కలిగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యింది. ఇంతకూ ఏం జరిగిందంటే…
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ ) ఎంపీ సుప్రియా సూలే కూతురు రేవతి సూలే రిసెప్షన్ వేడుకకు ప్రధాన మంత్రి మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ హై ప్రొఫైల్ వేడుకలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రధాని మోదీ రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రియాంక గాంధీని పలకరించారు. ప్రియాంక ఎలా వున్నావు అని మోదీ అడగ్గా నేను బాగున్నాను, మీరు ఎలా వున్నారంటూ బదులిచ్చారు. నేను ఇప్పటికీ అలాగే వున్నాను అని ప్రధాని మోదీ అన్నారు.
వీరిద్దరి సంభాషణ విన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కల్పించుకొని ప్రధాని మోదీతో…లేదు మీరు కొంచెం మారారు అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఈ సరదా ఘటన మీడియాలో రెండు రోజులుగా తెగ వైరల్ అవుతుంది. జాతీయ మీడియా ప్రధానంగా హైలెట్ చేస్తూ వార్త ప్రచురించింది. హై ప్రొఫైల్ నాయకులు అప్పుడప్పుడు ఇలా కలిసి కబుర్లు చెప్పుకోవడం కిందిస్తాయి కార్యకర్తలకు పాజిటివ్ సంకేతాలు పంపించినట్లు అవుతుందని, ఇది మంచి పరిణామం అని ప్రజాస్వామిక వాదులు చెబుతున్నారు.
This post was last modified on August 13, 2026 6:21 pm
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…