Political News

అన్నా చంపింది మనోళ్లే.. ఆ ఫోన్ కాల్ తో జగన్ ఇరకాటం!

మాచర్లలో వైసీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మృతుడి తండ్రి నవులూరి భాస్కర్‌రెడ్డి మాట్లాడిన ఫోన్‌కాల్‌ వీడియో వెలుగులోకి వచ్చింది. హత్యలో స్థానిక ఎమ్మెల్యేకు, టీడీపీ నాయకులకు ఏమైనా సంబంధం ఉందా అని జగన్‌ ప్రశ్నించగా.. “పక్కవాళ్ల పాత్ర ఏమీ లేదు.. నా కొడుకుని చంపింది మనవాళ్లే” అని భాస్కర్‌రెడ్డి సమాధానం ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది.

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై మృతుడి తండ్రితో జగన్‌ మాట్లాడిన ఫోన్‌కాల్‌ సోమవారం వెలుగులోకి రావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. హత్యలో టీడీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వర్గానికి సంబంధం ఉందా అనే కోణంలో జగన్‌ ప్రశ్నించినట్లు వీడియోలో ఉంది. అందుకు భాస్కర్‌రెడ్డి.. “పక్కవాళ్ల పాత్ర ఏమీ లేదు.. మనవాళ్లే చంపారు” అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

చెన్నారెడ్డి హత్యకు వైసీపీలోని అంతర్గత విభేదాలే కారణమని మృతుడి మామ ఆరోపించినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలే హత్యకు దారితీశాయని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ హత్యను టీడీపీ, స్థానిక ఎమ్మెల్యేకు ముడిపెట్టే రాజకీయ ప్రయత్నాలపై చర్చ మొదలైంది.

మృతుడి తండ్రి భాస్కర్‌రెడ్డి జగన్‌తో మాట్లాడిన సందర్భంగా పలుమార్లు తమవారే హత్యకు పాల్పడ్డారని చెప్పినట్లు వీడియోలో ఉండటం వైసీపీ రాజకీయ ప్రచారంపై టీడీపీ విమర్శలకు కారణమైంది. హత్య జరిగిన వెంటనే నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ కంటే.. ఘటనకు టీడీపీకి సంబంధం ఉందంటూ రాజకీయ విమర్శలు చేయడానికే వైసీపీ ప్రాధాన్యం ఇచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఫోన్‌కాల్‌లో భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యల అనంతరం జగన్‌ “సారీ అన్నా” అంటూ సంభాషణను ముగించినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో హత్య వ్యవహారాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ ప్రయత్నించిందన్న టీడీపీ ఆరోపణలకు ఈ వీడియో ఆయుధంగా మారింది. అయితే చెన్నారెడ్డి హత్యకు అసలు కారణాలు, నిందితులు ఎవరు, వారి రాజకీయ నేపథ్యం ఏమిటన్న అంశాలపై పోలీసుల దర్యాప్తులోనే పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

This post was last modified on August 11, 2026 1:09 pm

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

1 hour ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

4 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

5 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

5 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

7 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

8 hours ago