Political News

జెన్ జీ బాటలో రాజకీయ పార్టీలు

నీట్ పేపర్ లీకేజిపై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన జంతర్ మంతర్ ఆందోళన విజయవంతం కావడంతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇపుడు జెన్ జీ బాటలో నడిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారంలో వున్న పార్టీలు తమ అధికారం నిలుపుకునేందుకు, ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకునేందుకు జెన్ జీ మార్గం ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నాయి. ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఈదారిలో ఒక అడుగు ముందున్నాయి.

21 ఏళ్ళకే ఎన్నికల్లో పోటీ…..

ఇపుడు దేశమంతా జెన్ జీ గురించి మాట్లాడుతోంది. ఎవరికీ తలవంచని మోడీ ప్రభుత్వం జెన్ జీ ఉద్యమం ముందు చేతులెత్తేయడంతో యువత బలమేంటే దేశానికి తెలిసొచ్చింది. దీనికి ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసు 25 ఏళ్ళ నుంచి 21కి తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోకుండా ఈ ప్రతిపాదనతో అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించడం ద్వారా యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉలిక్కి పడింది. ఇపుడు బీఆర్ఎస్ నాయకులు కూడా జెన్ జీ గురించి మాట్లాడ్డం మొదలెట్టారు. జెన్ జీ తరహాలో ఉద్యమిస్తేనే హక్కులు సాధించగలుగుతామని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూధనా చారి బీసీ సంఘాల సమావేశంలో ప్రకటించారు. ఇతారా నాయకులు సైతం జెన్ జీ జపం చేస్తున్నారు.

డీఎస్సి అక్రమాలపై వైసీపీ పోరు….

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జెన్ జీ పై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. జంతర్ మంతర్ ఆందోళన తర్వాత ఇక్కడ వైసీపీ జెన్ జీ స్పూర్తితో రాజకీయం మొదలెట్టింది. డీఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఆమధ్య కొంత కాలం మాట్లాడి వదిలేసిన వైసీపీ ఇప్పుడు మళ్ళీ దాన్ని తెరమీదకు తీసుకొని వచ్చింది.

నీట్ పేపర్ లీకేజి వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లే డీఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుంది. తద్వారా యువకులు, విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం వుంది కనుక జెన్ జీ ఉద్యమ ప్రభావం అప్పటిదాకా పనిచేస్తుందో లేదో వేచి చూడాలి.

This post was last modified on July 30, 2026 1:13 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

22 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago