Political News

జెన్ జీ బాటలో రాజకీయ పార్టీలు

నీట్ పేపర్ లీకేజిపై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన జంతర్ మంతర్ ఆందోళన విజయవంతం కావడంతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇపుడు జెన్ జీ బాటలో నడిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారంలో వున్న పార్టీలు తమ అధికారం నిలుపుకునేందుకు, ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకునేందుకు జెన్ జీ మార్గం ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నాయి. ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఈదారిలో ఒక అడుగు ముందున్నాయి.

21 ఏళ్ళకే ఎన్నికల్లో పోటీ…..

ఇపుడు దేశమంతా జెన్ జీ గురించి మాట్లాడుతోంది. ఎవరికీ తలవంచని మోడీ ప్రభుత్వం జెన్ జీ ఉద్యమం ముందు చేతులెత్తేయడంతో యువత బలమేంటే దేశానికి తెలిసొచ్చింది. దీనికి ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసు 25 ఏళ్ళ నుంచి 21కి తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోకుండా ఈ ప్రతిపాదనతో అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించడం ద్వారా యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉలిక్కి పడింది. ఇపుడు బీఆర్ఎస్ నాయకులు కూడా జెన్ జీ గురించి మాట్లాడ్డం మొదలెట్టారు. జెన్ జీ తరహాలో ఉద్యమిస్తేనే హక్కులు సాధించగలుగుతామని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూధనా చారి బీసీ సంఘాల సమావేశంలో ప్రకటించారు. ఇతారా నాయకులు సైతం జెన్ జీ జపం చేస్తున్నారు.

డీఎస్సి అక్రమాలపై వైసీపీ పోరు….

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జెన్ జీ పై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. జంతర్ మంతర్ ఆందోళన తర్వాత ఇక్కడ వైసీపీ జెన్ జీ స్పూర్తితో రాజకీయం మొదలెట్టింది. డీఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఆమధ్య కొంత కాలం మాట్లాడి వదిలేసిన వైసీపీ ఇప్పుడు మళ్ళీ దాన్ని తెరమీదకు తీసుకొని వచ్చింది.

నీట్ పేపర్ లీకేజి వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లే డీఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుంది. తద్వారా యువకులు, విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం వుంది కనుక జెన్ జీ ఉద్యమ ప్రభావం అప్పటిదాకా పనిచేస్తుందో లేదో వేచి చూడాలి.

This post was last modified on July 30, 2026 1:13 pm

Share

Recent Posts

బాధితులను వదిలేసి నిందితులకు పరమార్శేంటి జగన్?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును జైల్లో ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అప్ప‌ల‌రాజును…

3 hours ago

న‌న్ను రాజీనామా కోరే హ‌క్కు ఎవ‌రికీ లేదు: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల‌పైనా తాను ముఖ్య‌మంత్రిని కాలేద‌ని.. 4 కోట్ల మంది ఓట‌ర్లు ఓటేసి త‌న‌ను గెలిపించుకున్నార‌ని.. వారి ఆశీర్వాదం,…

3 hours ago

‘పిల్లలను హాస్టల్లో వేస్తే… వాళ్ళు పెద్దలను ఓల్డేజ్ హోమ్ లలో వేస్తారు’

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…

4 hours ago

చంద్రబాబు అన్నం తింటున్నాడా.. గడ్డి తింటున్నాడా: జగన్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…

5 hours ago

ప్రమోషన్లకు పిలవలేదని హర్టయిన హీరోయిన్

తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…

6 hours ago

ఆదిపురుష్ పోలిక ఇప్పుడు అనవసరం

ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…

7 hours ago